‘మోసగాళ్లకు మోసగాడు ‘ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ కి బంపర్ రెస్పాన్స్..ఇప్పటి వరకు ఎంత గ్రాస్ వచ్చిందంటే!

- Advertisement -

మోసగాళ్లకు మోసగాడు టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాసుల వర్షం కురిపిస్తున్న రీ రిలీజ్ ట్రెండ్ ని చూసి దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పాత సినిమాలను రీ మాస్టర్ చేసి, సరికొత్త టెక్నాలజీ తో అదిరిపోయే సౌండ్ మిక్సింగ్ తో రీ రిలీజ్ చేస్తున్నారు.

మోసగాళ్లకు మోసగాడు
మోసగాళ్లకు మోసగాడు

ఈ క్రమం లో సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మైలు రాయిగా నిల్చిపోయిన చిత్రం, టాలీవుడ్ లో మొట్టమొదటి కౌ బాయ్ జానర్ లో తెరకెక్కిన సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని 4K టెక్నాలజీ తో అప్ గ్రేడ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ నెల 31 వ తారీఖున కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే అన్నీ ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. కొన్ని సిటీస్ మరియు టౌన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ కొన్ని మల్టిప్లెక్స్ థియేటర్స్ లో బుకింగ్స్ హౌస్ ఫుల్ షోస్ గా నమోదయ్యాయి. మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన AMB సినిమాస్ లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.

- Advertisement -

అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజే ప్రారంభించగా, రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్ సింహాద్రి చిత్రం కంటే వేగంగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈ ట్రెండ్ ని చూసి ఫ్యాన్స్ కూడా షాక్ కి గురయ్యారు. ముఖ్యంగా మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం‘ చిత్రం గ్లిమ్స్ వీడియో ని కూడా ఈ సినిమా అటాచ్ చేసి విడుదల చేస్తున్నారు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ అంత వేగంగా ఉంది ఉండొచ్చని విశ్లేషకుల అభిప్రాయం.ఇప్పటి వరకు గ్రాస్ వసూళ్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 10 లక్షలు వచ్చాయని టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here