అనాధ పిల్లల కోసం ‘ఆదిపురుష్’ రెమ్యూనరేషన్ లో 80 శాతం విరాళం ఇచ్చిన ప్రభాస్.. ఇలాంటి గుణం ఎవరికీ ఉంటుంది!

- Advertisement -

ప్రతీ సినీ లవర్ కి ఒక అభిమాన హీరో ఉంటాడు..కానీ ప్రతీ హీరో అభిమాని కామన్ గా ఇష్టపడే హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన చేసే సినిమాలతో పాటుగా, ఆయన ఉదారస్వభావం, తోటి హీరోలతో ఆయనకీ ఉన్న స్నేహం ప్రభాస్ ని అందరూ ఇష్టపడేలా చేసింది. ప్రభాస్ ఇప్పటి వరకు తాను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత అనాధపిల్లలకు సహాయ పడుతూ ఉండే విషయం మన అందరికీ తెలిసిందే.

ప్రభాస్
ప్రభాస్

అయితే ఆయన ఎప్పటికీ ఇలాంటివి బయటకి చెప్పుకోడు, మూడో కంటికి తెలియకుండా సహాయం చేస్తూ ఉంటాడు. ఎవరో ఒకరు ఆయన సన్నిహితులు చెప్తే కానీ ఆయన చేస్తున్న సేవాకార్యక్రమాలు గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. ఇక రీసెంట్ గా ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం వచ్చే నెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా ఈ చిత్రం కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ లో 80 శాతం ఒక అనాధాశ్రమానికి విరాళంగా ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్, అంటే ఆయన 80 కోట్ల రూపాయిల డబ్బులను అనాధాశ్రమానికి విరాళం గా ఇచ్చాడన్నమాట. ఇంత భారీ మొత్తం లో డబ్బులు అనాధలకు విరాళంగా ఇవ్వడం మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ హీరో కూడా చెయ్యలేదు.

- Advertisement -

ఒక లక్ష రూపాయిలు విరాళం ఇవ్వాలంటే వందసార్లు ఆలోచించే జనాలు ఉన్న ఈరోజుల్లో, అన్ని కోట్ల రూపాయిలు లెక్క చెయ్యకుండా విరాళం ఇచ్చాడంటే ఆయన మనస్సు ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ని జూన్ 1వ తేదీ నుండి ఘనంగా ప్రారంభించబోతున్నాడు ప్రభాస్. జూన్ 6 వ తేదీన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here