Prabhas : ప్రభాస్‎ను నమ్మి వేల కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు.. కాస్త అటు ఇటు అయితే

- Advertisement -

Prabhas : భారతీయ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరో ఎవరంటే ప్రభాస్ అని ఠక్కున చెబుతారు. బాహుబలి తర్వాత తను చేసే ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమా తర్వాత ప్రభాస్‌కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ పెరిగింది. ఈ సినిమా రెండు భాగాల్లోనూ ప్రభాస్ ప్రధాన పాత్రలో కనిపించాడు. ప్రభాస్ తన రాబోయే చిత్రాల షూటింగ్ లలో బిజీగా ఉన్నాడు. వీటిలో మొదట వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ‘కల్కి 2898 AD’ చిత్రం ఉంది. ఇది కాకుండా మరికొన్ని సినిమాలతో ప్రేక్షకులకు 200శాతం వినోదం ఇవ్వనున్నాడు. ‘కల్కి 2898 AD’ కాకుండా ప్రభాస్ రెండు సినిమాలు – ‘ది రాజా సాబ్’, ‘స్పిరిట్’ కూడా థియేటర్లలోకి త్వరలో రానున్నాయి.

prabhas
prabhas

‘కల్కి 2898 AD’
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు ‘కల్కి 2898 AD’లో కనిపించబోతున్నారు. మీడియా కథనాల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 600 కోట్లు. ఈ చిత్రాన్ని 2020లోనే ప్రకటించారు. అయితే, దీని షూటింగ్ జూలై 2021 నుండి ప్రారంభమైంది. ఈ సినిమా పలు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటివరకు మేకర్స్ విడుదల చేసిన టీజర్ ఇది సైన్స్ ఫిక్షన్ చిత్రం. భారతీయ చరిత్ర, పురాణాల కలయికని కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

‘ది రాజా సాబ్’
ఇక ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై కూడా చర్చ నడుస్తోంది. ఈ చిత్రం రొమాంటిక్ హారర్ చిత్రంగా ఉండనుంది. మారుతి దాసరి దర్శకత్వం వహిస్తున్నారు. దానికి కథ కూడా తానే రాసుకున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కూడా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్ చేస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.200 కోట్లు అని అంటున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోడం లేదని సమాచారం. కాకపోతే సినిమా లాభాల్లో వాటా తీసుకున్నాడట. ఈ చిత్రాన్ని జనవరి 2024లో అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వింత స్టైల్‌లో కనిపిస్తున్నాడు. నల్ల చొక్కా, లుంగీ ధరించి పూర్తి దక్షిణాది అనుభూతిని పంచుతున్నాడు ప్రభాస్.

- Advertisement -

‘స్పిరిట్’
‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. మీడియా కథనాల ప్రకారం ‘స్పిరిట్’ బడ్జెట్ దాదాపు రూ.300 కోట్లు. సందీప్ రెడ్డి వంగా తన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రభాస్.. అతను రావడంతో సినిమాపై క్రేజ్ చాలా పెరుగుతుందని చెప్పారు. దీని తర్వాత, టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటే.. ఈ చిత్రం మొదటి రోజే 150 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here