మహేష్ బాబు ‘గుంటూరు కారం’ టీజర్ లీక్..త్రివిక్రమ్ మాస్ డైలాగ్స్ మామూలు రేంజ్ లో లేవుగా!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం.ఈ నెల 31 వ తారీఖున మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ మరియు గ్లిమ్స్ వీడియో ని అధికారకంగా విడుదల చెయ్యబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ఇవ్వబోతుంది మూవీ టీం.

గుంటూరు కారం
గుంటూరు కారం

ఈ చిత్రం లో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒక పాత్ర ఊర మాస్ గా ఉంటుందట. మిర్చి ఫ్యాక్టరీ కి ఓనర్ గా ఈ పాత్ర లో కనిపించబోతున్నాడట మహేష్ బాబు. మరో పాత్ర చాలా సాఫ్ట్ గా ఉంటుందట. 31 వ తేదీన మాస్ క్యారక్టర్ కి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారట.

Mahesh Babu

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక డైలాగ్ సోషల్ మీడియా లో లీక్ అయ్యింది.ఆ డైలాగ్ చూసిన తర్వాత మహేష్ క్యారక్టర్ ని త్రివిక్రమ్ ఎంత మాస్ గా రాసుకున్నాడో అర్థం అవుతుంది. ఆయన ఈ రేంజ్ మాస్ అవతార్ లో కనిపించి చాలా ఏళ్ళు అయ్యింది. ఫ్యాన్స్ మహేష్ నుండి ఊర మాస్ కోరుకుంటున్న సమయం లో వాళ్ళ కోరికకు తగ్గట్టుగానే బిజినెస్ మ్యాన్ తర్వాత ఆ రేంజ్ మాస్ క్యారక్టర్ మహేష్ కి పడినట్లు గా అనిపిస్తుంది.అయితే ఈరోజు లీక్ అయినా ఈ డైలాగ్ సినిమాలో డైలాగా?, లేదా 31 వ తారీఖున విడుదల అవ్వబోతున్న గ్లిమ్స్ వీడియో కి సంబంధించిన డైలాగా అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -
Mahesh Babu Guntur Karam

ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే విలన్ జగపతి బాబు మాట్లాడుతూ ‘ రేయ్ ఏంట్రా బీడీ తాగుతూ న ఇంట్లోకే వచ్చావ్’ అని అంటాడు. దానికి మహేష్ కౌంటర్ ఇస్తూ ‘ రేయ్.. రేయ్.. జగ్గు బీడీ ఇపోలోపు మార్కెట్ కు.. వెళ్లి క్షమించమని అడుగు లేదా ఇప్పుడే ఎర్రకారం తిని వచ్చా .. పల్నాడు నడిబొడ్డున పండబెట్టి పాతేస్తా’ అని అంటాడు. కేవలం డైలాగ్ వింటుంటేనే ఈ రేంజ్ గూస్ బంప్స్ వస్తుంటే , ఇక విజువల్ చూసిన తర్వాత ఫ్యాన్స్ ఏమైపోతారో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here