విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్..?

- Advertisement -

ఈ ఏడాది భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాలలో ఒకటి విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. లైగర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా అయ్యినప్పటికీ ఈ ఖుషి ఈ చిత్రానికి ఏమాత్రం కూడా క్రేజ్ తగ్గలేదు.

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ

పైగా ఆ టైటిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ సినిమా టైటిల్ అవ్వడం తో ఈ క్రేజ్ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఆగస్టు 9 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు. ఇకపోతే త్వరలోనే నిర్వహించబోయ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించబోతున్నట్టు సమాచారం.

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంతభాగం జరిగింది. ఈ నెల మధ్యలో నుండి మిగిలిన షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది.

- Advertisement -

అయితే పవన్ కళ్యాణ్ ని మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పిలిస్తే సినిమాకి చాలా ప్లస్ అవుతుందని, అంతే కాకుండా ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్ ని పెట్టుకున్నందుకు కచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ నెల 10 వ తారీఖు నుండి ‘వారాహి విజయ యాత్ర’ లో పాల్గొనబోతున్నాడు. ‘ఖుషి‘ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయానికి ఆయన డేట్స్ అందుబాటులో ఉంటాయో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here