మ‌నంసినిమాలో శ్రియా క్యారెక్టర్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

- Advertisement -

అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన సినిమా ‘మ‌నం’.. ఈ మూవీ ఆ ఫ్యామిలీకి చాలా ప్రత్యేకం. ఎందుకంటే మూడు తరాల హీరోలంతా కలిసి ఆ సినిమాలో నటించారు. , అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తారాల హీరోలు ఇందులో న‌టించారు. అంతే కాకుండా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు కూడా ఇదే ఆఖరి చిత్రం. ఈ సినిమాను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించారు. నాగార్జున‌, నాగ‌చైత‌న్య హీరోలుగా… శ్రియా, స‌మంత హీరోయిన్లుగా నటించారు. ఏఎన్నార్‌, అఖిల్‌, అమ‌ల‌, రాశి ఖ‌న్నా, బ్రహ్మానందం లాంటి మేటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన సినిమా.. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా మంచి విజయం అందుకుంది.

శ్రియా
శ్రియా

నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2014లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద క్లాసికల్ హిట్ టాక్ తో మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో మన్మథుడు నాగార్జున – శ్రియ, చైతు సమంత జంటల మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా పండింది. ఈ సినిమాతో శ్రియకు మంచి పేరు వచ్చింది. కాకపోతే ఈ సినిమాకు శ్రియ ఫస్ట్ ఛాయిస్ కాదట. నాగార్జునకు జోడిగా మొదట ఓ స్టార్ హీరోయిన్ ను అనుకున్నారట. కానీ, ఆమె రిజెక్ట్ చేయడంతో శ్రియకు ఈ ఆఫర్ వచ్చిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా.. తనేనండి అరుంధతి అనుష్క. అనుష్క అప్పటికే నాగ్ తో కలిసి చాలా చిత్రాలు చేసింది. సూపర్, డాన్, డమరుకం వంటి చిత్రాలతో ఆన్ స్ర్కీన్ పై రొమాంటిక్ పేయిర్ అనిపించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాకు శ్రియా కంటే ముందు అనుష్కను అనుకున్నారట. కానీ, అనుష్క ఆ సమయంలో ప్రభాస్ తో మిర్చి మూవీతో బిజీగా ఉండడంతో చేయలేకపోయిందట. అలా ప్రాజెక్ట్ లోకి అనుష్క ప్లేస్ లో శ్రియ వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here