Nabha Natesh: ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది నభా నటేష్. తెలుగులో ఈ అమ్మడికి మొదటి సినిమాతోనే అందంతో పాటు నటన విషయంలో మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమాల వరుసగా ఈ అమ్మడికి ఆఫర్లు తలుపు తట్టాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో పాటు చాందిని పాత్రలో ఈ అమ్మడు పోషించిన పాత్రకు మంచి పేరే వచ్చింది.
ఇస్మార్ట్ సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ యూత్ ను బాగా ఆకట్టుకుంది.. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీగా అయ్యింది. తాజాగా ఈ అమ్మడుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ అమ్మడు నిఖిల్ స్వయంభు, ప్రియదర్శితో డార్లింగ్ అంటూ పలు ప్రాజెక్టులతో నభా నటేష్ మళ్లీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కరోనా కంటే ముందు నభా నటేష్ మంచి జోరు మీద ఉండేది. సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ అంటూ ఇలా వరుస చిత్రాలతో సందడి చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే కరోనా సమయంలో జరిగిన ప్రమాదం వల్ల ఇంటికే పరిమితం అయ్యింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
అప్పుడు జరిగిన ప్రమాదంలో ఈ అమ్మడుకు భుజం, మోచేతికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఆ గాయం గుర్తులు అలాగే ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ రీల్ని చూస్తే ఈ విషయం పై క్లారిటీ వస్తుంది. ఆ గాయాలు మానలేదని తెలుస్తుంది. ఈ అమ్మడు త్వరలోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
View this post on Instagram