Allari naresh : చిక్కుల్లో పడ్డ అల్లరి నరేశ్.. కోర్టు నుంచి నోటీసులు పంపనున్న ఇళయరాజా ?

- Advertisement -

Allari naresh : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన తన సంగీతం పక్కన పెట్టి కాపీ రైట్ కేసులు వేసుకుంటూ కూర్చున్నట్లు అనిపిస్తుంది. తాను మ్యూజిక్ ఇచ్చిన పాటలను తన పర్మీషన్ లేకుండా వాడుకుంటున్నారని కోర్టు మెట్లు ఎక్కడాలు.. అక్కడ ఆయనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం వంటివి ఇటీవల జరుగుతున్నాయి. అయినా, ఆయన తగ్గేదేలే అంటున్నారు. తాను మ్యూజిక్ అందించిన పాటలను తన అనుమతి లేకుండా వాడుకుంటున్నారు అంటూ కాపీ రైట్ కేసు కింద నోటీసులు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓ టాలీవుడ్ హీరోకు ఇళయరాజా కాపీ రైట్ కేసు కింద నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరా హీరో..? నోటీసులు ఎందుకు ఇస్తారు అని అనుకుంటున్నారా..?

ఇటీవలే అల్లరి నరేష్ నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే సినిమా విడుదల అయింది. ఈ మధ్య కాస్త రూట్ మార్చి ఇప్పటి వరకు సీరియస్ మూవీస్ చేస్తూ వచ్చిన.. అల్లరి నరేష్ మళ్లీ ఆ ఒక్కటి అడక్కు అనే కామెడీ మూవీతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అలా సినిమాలో… “నేను మారిపోయాను… సీరియస్ అయిపోయాను… అని అనుకున్నారా…? నాలో కామెడీ ఇంకా అలాగే ఉంది” అంటూ ఓ డైలాగ్ కూడా పెట్టేశాడు. ఈ సినిమా డైలాగ్‌లు పక్కన పెడితే, సినిమాలో ఓ పాట ఉంది. 1992లో అల్లరి నరేష్ తండ్రి ఈవీవీ డైరెక్షన్ లో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు మూవీలో రాజాధి రాజాది.. అనే సాంగ్ ను ఈ రోజు రిలీజ్ అయిన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఓ సందర్భంలో వాడేశారు చిత్రమేకర్స్. అల్లరి నరేష్ తండ్రి దర్శకత్వంలో వచ్చిన సినిమాలో పాటను వాడితే తప్పేంటి అంటారా..?

- Advertisement -

డైరెక్టర్ ఈవీవీనే. కానీ, ఆ పాటకు మ్యూజిక్ ఇచ్చింది మాత్రం మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా. ఈయన ప్రస్తుతం తన మ్యూజిక్ తో వచ్చిన సాంగ్స్ ను తన అనుమతి లేకుండా వాడుకుంటున్నారు అంటూ కేసులు వేస్తున్నారు కదా.. అలా అల్లరి నరేష్ పైన ఈ రోజు రిలీజ్ అయిన ఆ ఒక్కటి అడక్కు చిత్రబృందం పై కాపీ రైట్ కేసు వేసే అవకాశం ఉందని.. అందుకు సంబంధించి లీగల్ నోటీసులు పంపించే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు భావిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here