Ram Charan : లీకైన పాటకు కూడా ఇంత బిల్డప్ అవసరామా అని రామ్ చరణ్ ను హేళన చేశారు.. ఇప్పుడు అదే రికార్డులు బ్రేక్ చేస్తుంది..

- Advertisement -

Ram Charan : గేమ్ ఛేంజర్ మూవీలోని ఈ జరగండి పాట కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేశారు. ఇంత భారీ బడ్జెట్ తో మూడు, నాలుగు చిన్న సినిమాలనే తీసేయొచ్చు. ఈ పాటతో రామ్ చరణ్ ఇప్పుడు షారుక్ ఖాన్ రికార్డును బ్రేక్ చేశాడు. నిజానికి ఈ సినిమాలోని అన్ని పాటలపై శంకర్ భారీగా ఖర్చు చేశాడు. అయితే ఈ పాట కోసం చేసిన ఖర్చు వివరాలు మాత్రం బయటకు వచ్చాయి. ఈ మధ్యే గేమ్ ఛేంజర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న తమన్ ఈ జరగండి సాంగ్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Ram Charan
Ram Charan

ఆ పోస్టర్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తోంది. అయితే ఏకంగా ఒక్క పాట కోసమే రూ.20 కోట్లు ఖర్చు పెట్టడం మాత్రం మామూలు విషయం కాదు. ఈ భారీ ఖర్చుతో జరగండి ఇప్పుడు ఇండియాలోనే అత్యంత ఖరీదైన పాటగా నిలిచింది. ఈ మధ్యే రిలీజై సూపర్ డూపర్ హిట్ అయిన జవాన్ మూవీలో జిందా బందా అనే సాంగ్ కోసం కూడా భారీగా ఖర్చు పెట్టారు. ఈ పాటను రూ.15 కోట్లతో చిత్రీకరించినట్లు సమాచారం. ఆ లెక్కన షారుక్ ఖాన్ రికార్డును ఇప్పుడు రామ్ చరణ్ బ్రేక్ చేసినట్లయింది.

game changer

నిజానికి శంకర్ డైరెక్షన్ లోనే వచ్చిన 2.0 మూవీలో యంత్ర లోకపు సుందరివే సాంగ్ ను కూడా రూ.20 కోట్లతో చిత్రీకరించినట్లు సమాచారం. ఇక ఈ పాటను ఇటీవల ఎవరో ఎక్స్ లో షేర్ చేశారు. దాన్నే రిలీజ్ చేయడం పై పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు గేమ్ ఛేంజర్ మూవీ చాలా ఆలస్యమవుతూ వస్తోంది. శంకర్ ఓవైపు ఇండియన్ 2 చేస్తూనే ఈ గేమ్ ఛేంజర్ కూడా చేస్తుండటంతో షూటింగ్ తరచూ వాయిదా పడుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here