Big Boss : బిగ్ బాస్ హౌస్ కి కొత్త కెప్టెన్ గా గౌతమ్..ఎలిమినేషన్ భయంతో వణికిపోతున్న శోభా శెట్టి !

- Advertisement -

Big Boss : బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమై అప్పుడు 8 వారాలు పూర్తి అయ్యింది. మొదటి 4 వారాలు ‘పవర్ అస్త్ర’ అనే కొత్త కాన్సెప్ట్ టాస్కులు ఆడిన కంటెస్టెంట్స్ గత నాలుగు వారాల నుండి ఇంతకు ముందు సీజన్స్ లో లాగానే కెప్టెన్సీ టాస్కులు ఆడుతున్నారు. గత వారం కెప్టెన్సీ టాస్కు గెలిచి అర్జున్ కెప్టెన్ అవ్వగా, ఈ వారం కెప్టెన్ గా గౌతమ్ గెలిచాడు.

Big Boss
Big Boss

మొదటి నుండి టాస్కులలో ఎంతో చురుగ్గా ఉండే గౌతమ్, ఈ వారం చివరి కాపెన్సీ పోటీదారులుగా నిల్చిన పల్లవి ప్రశాంత్, సందీప్, శోభా శెట్టి మరియు ప్రియాంక వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఓడించి ఇంటికి నాల్గవ కెప్టెన్ అయ్యాడు. ఈ వారం మొత్తం బిగ్ బాస్ మారథాన్ అనే కాన్సెప్ట్ మీద ఇంతకు ముందు వారం లో లాగ గ్రూప్ గేమ్స్ కాకుండా ఎవరికీ వారు సొంత ఆటని ఆడుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్.

ఈ 5 మంది కంటెస్టెంట్స్ లో ఎవరు కెప్టెన్ అవ్వాలి అనేది హౌస్ మేట్స్ నిర్ణయానికే వదిలేసాడు బిగ్ బాస్. ‘ఈ మిర్చి చాలా హాట్ గురూ’ అనే టాస్కు పేరిట హౌస్ మేట్స్ ఎవరికీ అయితే కంటెండర్లుగా నిల్చిన వారిలో కెప్టెన్ అవ్వడానికి ఇష్టం లేదో, వారికి మిర్చి మాలా వెయ్యాల్సి ఉంటుంది. ఎవరికీ తక్కువ మిర్చి మాలలు వస్తాయో, వాళ్ళు ఇంటికి కెప్టెన్ అవుతారు.

- Advertisement -

ఈ టాస్కు చాలా వాడావేడి వాతావరణం లో కొనసాగింది. ప్రిన్స్ యావర్ మరియు శోభా శెట్టి మధ్య పెద్ద గొడవ జరిగింది. శోభా శెట్టి యావర్ ని పిచ్చోడు అని పిలవగా, యావర్ కోపం తో రెచ్చిపోతాడు. శోభా శెట్టి ని నామినేట్ చెయ్యడానికి వచ్చిన ప్రతీ ఒక్కరిపై చాలా ఫైర్ అయ్యింది. ఆ ఫైర్ లో ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వబోతుంది అనే ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here