Allu Arha : మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ.. బన్నీ ఫ్యాన్స్ కు పండగే..!

- Advertisement -

Allu Arha : సర్కారు వారి పాట మూవీ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే.

Allu Arha
Allu Arha

మధ్యమధ్యలో కాస్త బ్రేకులు పడినా.. ఈ మూవీ షూటింగ్ త్వరత్వరగా జరిగిపోతుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం.  ఈ మూవీని త్రివిక్రమ్ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ అవుతోంది. 

Allu Arjun with Arha
Allu Arjun with Arha

అదేంటంటే మహేశ్ బాబు సినిమాలో ఓ కీలక పాత్రలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో ఓ కీలక పాత్రకు అర్హ అయితే కరెక్ట్ గా సూట్ అవుతుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారట. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ వార్త విని అటు మహేశ్ బాబు ఫ్యాన్స్.. ఇటు బన్నీ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు.

- Advertisement -
Allu Arha and Mahesh Babu
Allu Arha and Mahesh Babu

ఒకవేళ ఇదే నిజమైతే.. మహేశ్ సినిమాలో అర్హ నటించడానికి అల్లు ఫ్యామిలీ ఓకే అంటుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికే అర్హ.. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేశ్ సినిమాలో కూడా నటిస్తే బాగుంటుందని అభిమానులు ఆశ పడుతున్నారు.

ఇటీవల గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ, బిజినెస్ మేన్ రవిల రిసెప్షన్ వేడుక అంగ రంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు బన్నీ, మహేశ్ హాజరయ్యారు. ఈ వేడుకలో మహేశ్ బాబు.. అర్హతో మాట్లాడారు. ఈ ఇద్దరి సంభాషణ చూసి అక్కడున్న ఐకాన్ స్టార్ మురిసిపోయాడు.

ఇక మహేశ్ తాజా సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ఫ్లాష్ బ్యాక్‌తో పాటు ప్రస్తుతం జరిగే సీన్స్‌ను వెరైటీ స్క్రీన్ ప్లే ‌తో త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే మహేశ్ బాబు సన్నివేశాలే ఈ సినిమాకు హైలెట్ కానున్నాయట. గత కొన్నేళ్లుగా  వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మరో కథానాయికగా శ్రీలీల నటించబోతున్నట్టు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here