చేతులారా కెరీర్ నాశనం చేసుకుంటున్న త్రిష.. ఇక నిన్ను కాపాడేవారెవ్వరు లేరు భామ

- Advertisement -

సినిమాకో కొత్త హీరోయిన్ వస్తున్న రోజులివి. ఈ జనరేషన్ లో పదేళ్ల కెరీర్ కొనసాగించడం ఏ హీరోయిన్ కి అయినా అసాధ్యమే. కానీ.. అంతకంటే పెద్ద మ్యాజిక్ చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ‘జోడి’ సినిమాలో హీరోయిన్ సిమ్రన్ కు ఫ్రెండ్స్ లో ఒకరిగా నటించింది త్రిష. తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సౌత్ ఇండియన్ ఫిమేల్ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగింది. త్రిష ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2002లో తమిళంలో సూర్య హీరోగా వచ్చిన ‘మౌనం పెసియాదే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది త్రిష. ఆ సినిమా 2002 డిసెంబర్ 13న విడుదలైంది.

త్రిష
త్రిష

2003లో నీ మనసు నాకు తెలుసు ద్వారా తెలుగులో పరిచయం అయింది. 2004లో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘వర్షం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో త్రిష వెనుదిరిగి చూడలేదు. వరుస హిట్లు ఆమె కెరీర్లో పడ్డాయి. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు.. వంటి బ్లాక్ బస్టర్లు ఆమెను స్టార్ హీరోయిన్ గా మార్చేశాయి. తమిళ సినిమాల్లో కూడా వరుసగా సామి, లేసా లేసా, ఆరు, గిల్లి, తిరుపాచ్చి.. వంటి సూపర్ హిట్స్ తో కెరీర్ అప్రతిహతంగా కొనసాగింది. చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, మహేశ్, ఎన్టీఆర్, ప్రభాస్, విజయ్, అజిత్.. వంటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది.

తాజాగా త్రిష గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. గతంలో చిరంజీవికి జోడిగా త్రిష స్టాలిన్ చిత్రంలో నటించింది. ఇప్పుడు తాజాగా మరొక చిత్రంలో కూడా నటించేందుకు సిద్ధమయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా సిద్దు జొన్నలగడ్డకు తల్లిగా త్రిష నటించబోతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ చిత్రాన్ని పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. తమిళ చిత్రమైన కామెడీ బ్రో డాడీని చిరంజీవి రీమిక్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఒరిజినల్గా ఈ చిత్రంలో మోహన్ లాల్, మీనా పృథ్వీరాజ్ తల్లిదండ్రులుగా కనిపించడం జరిగింది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది.

- Advertisement -

తెలుగులో ఈ చిత్రంలో చిరంజీవి త్రిష సీనియర్ లీడ్ ను పోషించబోతున్నట్లు సమాచారం. సిద్దు జొన్నలగడ్డ, శ్రీ లీల జూనియర్ లీడ్ ను పోషిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు త్రిష హీరోయిన్ లీడ్ రోల్స్ నే పోషించింది. 28 ఏళ్లు ఉన్న సిద్దు జొన్నలగడ్డకు 40 ఏళ్ల వయసులో త్రిష తల్లిగా నటించడానికి అంగీకరించడంతో పలువురు అభిమానులు తీవ్ర ఆవేదనను తెలియజేస్తున్నారు. ఇలాంటివి ఒప్పుకోవడం వల్ల తన సినీ కెరియర్ నాశనం అవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. కేవలం రెమ్యూనరేషన్ కోసమే త్రిష ఇలాంటి పనిచేస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here