‘ఆదిపురుష్’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. విజువల్ ఎఫెక్ట్స్ లో అవతార్ కి పోటీ

- Advertisement -

ఆదిపురుష్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమాలలో శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రం ‘ఆది పురుష్’. షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి అయ్యినప్పటికీ , VFX వర్క్ బ్యాలన్స్ ఉండడం తో ఇన్ని రోజులు విడుదల కాలేదు ఈ చిత్రం. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేద్దాం అనుకున్నారు.

ఆదిపురుష్
ఆదిపురుష్

కానీ టీజర్ లోని గ్రాఫిక్స్ కి ఫ్యాన్స్ నుండి వచ్చిన నెగటివ్ కామెంట్స్ ని పరిగణలోకి తీసుకొని, మరోసారి గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేసి, అద్భుతంగా వచ్చింది అనుకున్నప్పుడే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే నెల 16 వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ కాపీ సిద్ధం అయ్యింది. రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మాతలు చూసారు.

ఈ సినిమా మొదటి కాపీ ని చూసి దిల్ రాజు ఎంతో సంతోషపడ్డాడట, రామాయణం ని సరికొత్త టెక్నాలజీ లో చూసిన అనుభూతి అద్భుతంగా ఉందని, కచ్చితంగా థియేటర్స్ లో ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతారని అన్నాడట. టీజర్ విడుదల అయ్యినప్పుడు ఏ గ్రాఫిక్స్ ని అయితే అభిమానులు మరియు ఆడియన్స్ బాలేదని నెగటివ్ కామెంట్స్ చేసారో, ఇప్పుడు వాళ్ళే ఈ చిత్రం గ్రాఫిక్స్ ని చూసి మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి కదులుతారనే నమ్మకం ఉందంటూ దిల్ రాజు నిర్మాతలతో అన్నాడట.

- Advertisement -

ఈ చిత్రం నైజాం మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా, సీతగా కృతి సనన్ , మరియు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో ప్రభాస్ లో 3 నిమిషాల పాటు ఆపకుండా చెప్పే భారీ డైలాగ్ ఫ్యాన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుందట, ఇవన్నీ నిజమో కాదో తెలియాలంటే 16 వ తేదీ వరకు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here