ప్రభాస్ వల్ల ఆ హీరోయిన్ కెరీర్ నాశనమైందా.. పాపం

- Advertisement -

మనం సరదా సరదాగా మాట్లాడే మాటలు అప్పుడప్పుడు నిజమైపోతూ ఉంటాయి. ఇక అలా సరదాగా అన్న మాటలు నియమవుతో ఉన్న ప్రతిసారి నీ నాలుకకి ఏదో పవర్ ఉందని నువ్వు అన్నది ప్రతిదీ జరుగుతుందని అంటూ ఉంటారు. అయితే తాజాగా అచ్చం ఇలాగే ఒక సినీ సెలబ్రిటీగా విషయంలో కూడా జరిగిందని అంటున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే ప్రభాస్ పూజా హెగ్డే ఇద్దరు జంటగా రాదే శ్యామ్ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా సమయంలో పూజ చాలా ఇబ్బంది పెట్టిందట.

ప్రభాస్
ప్రభాస్

రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌ సమయంలోనే ప్రభాస్‌- పూజ హెగ్డేల మధ్య మనస్పర్థలు వచ్చాయని అలాగే వారిద్దరు మధ్య మాటలు లేవని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో సైతం వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు అస్సలు కనిపించలేదు. పక్కనే పక్కనే ఉన్నప్పటికీ మూవీ హీరోహీరోయిన్‌ మధ్య ఉండే బాండింగ్‌, కెమిస్ట్రీ అయితే మిస్‌ అయ్యింది. ఈ కార్యక్రమంలో వారిద్దరూ ఎడమెహం పెడమెహంగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చెకూరిందట. దాంతో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిందట పూజా హెగ్డే. దీనిపై పూజా అభిమానులు ప్రభాస్ ను భారీగా ట్రోల్ చేశారు కూడా. ఆయన వల్లే పూజా కెరీర్ నాశనమైందన్నారు.

పూజా హెగ్డే షూటింగ్ సమయంలో ప్రవర్తించిన తీరుతో చిత్రయూనిట్ అనేక ఇబ్బందులు ఎదుర్కోందని.. దీంతో ప్రభాస్ ఆమెపై సీరియస్ అయినట్లుగా గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అవన్ని రూమర్స్ మాత్రమే అంటూ యూవీ క్రియేషన్స్ కొట్టిపాడేసింది. తాజాగా ప్రభాస్.. తనకు ఉన్న మనస్పర్థల గురించి వివరణ ఇచ్చింది పూజా హెగ్డే.. షూటింగ్ సమయంలో ప్రభాస్ తో తనకు మనస్పర్థలు వచ్చినట్టు వస్తున్న వార్తలలో నిజం లేదని.. మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉన్నామని.. ప్రభాస్ తనకోసం చాలాసార్లు స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ తీసుకువచ్చారని తెలిపింది. తను చాలా మంచి వ్యక్తి అంటూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here