అన్​స్టాపబుల్-2లో యంగ్​ హీరోస్.. ‘మీలాంటి వాళ్లని పిలవడమే తప్పు’ అంటూ బాలకృష్ణ ఫైర్

- Advertisement -

వెండితెరతో పాటు బుల్లితెరపైనా నందమూరి బాలకృష్ణ అన్​స్టాపబుల్​గా దూసుకెళ్తున్నాడు. ఆహా ఓటీటీ వేదికగా వస్తోన్న అన్​స్టాపబుల్​ షోకు సూపర్ క్రేజ్ రావడంతో సీజన్ 2 కూడా ప్లాన్ చేశారు. ఇప్పటికే 3 ఎపిసోడ్లు కూడా స్ట్రీమింగ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. తాజా ఎపిసోడ్​కి బాలకృష్ణ.. టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్స్ అడవి శేష్, శర్వానంద్​లను గెస్టులుగా పిలిచారు. అయితే షో మధ్యలో బాలయ్య.. ‘మీలాంటి వారిని షోకు పిలవడమే తప్పు’ అని ఫైర్ అయ్యారు. అప్పటిదాకా సరదాగా సాగిన షో.. సడెన్​గా సీరియస్ ఎందుకైంది. అసలు బాలకృష్ణ.. అడవి శేష్, శర్వానందన్​లను అలా ఎందుకన్నారు.

అన్​స్టాపబుల్-2 షోలో భాగంగా బాలకృష్ణ గెస్టుల లైఫ్​లో జరిగిన కొన్ని సంఘటనలు, సరదాలు గురించి మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు మధ్యలో చిలిపి చిలిపి గేమ్స్ కూడా ఆడిస్తుంటారు. అలా ఓ గేమ్‌లో భాగంగా శేష్‌, శర్వానంద్‌లపై బాలకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. సినిమాల్లో ఎవరెవరకి ముద్దు పెట్టావ్‌? ఏ హీరోయిన్‌కు పెట్టాలనుకుంటున్నావ్‌? అనే ప్రశ్నకు ‘‘నేను తొలిసారిగా అదాశర్మకు, చివరిగా మీనాక్షి చౌదరికి పెట్టా. కత్రినా కైఫ్‌ను కిస్‌ చేయాలనుంది’’ అని శేష్‌ సమాధానమిచ్చారు. నీ ఫోన్‌లో ఆ వీడియోలు ఎన్ని ఉన్నాయ్‌? అని అడగ్గా ‘‘సర్‌.. మీ నాన్నగారి దగ్గర మా తాత అకౌంటెంట్‌గా పనిచేశారు. మీకు సంబంధించిన అన్ని వివరాలు మా దగ్గరున్నాయి. ఇప్పుడు చెప్పమంటారా’’ అంటూ శర్వానంద్‌ సమాధానం దాటవేశారు. దాంతో, ‘మీలాంటి వారిని షోకు పిలవడమే తప్పు’ అంటూ బాలకృష్ణ నవ్వులు పంచారు.

ఈ షోలో అడవి శేష్ మాట్లాడుతూ.. ‘‘నా చిన్నప్పుడు మీ (బాలకృష్ణ) సినిమాలోని ‘బీడీలు తాగండి బాబులు’, ‘ముద్దు పాప’ పాటలు పాడుతుంటే మా అమ్మ నన్ను కొట్టింది. తలపై పడిన మచ్చ ఇప్పటికీ ఉంది. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పుడు శర్వానంద్‌ నాకు స్ఫూర్తిగా నిలిచాడు. కెరీర్‌ ప్రారంభంలో నాకెవ్వరూ అవకాశాలు ఇచ్చేవారు కాదు. స్వతహాగా రచనపై ఆసక్తి ఉండటంతో నా సినిమాలకు నేనే కథలు రాసుకునేవాణ్ని. సినిమాలు చేయడమనేది ఓ వరంలాంటిది. అది అందరికీ దక్కేదికాదు. నా తొలి సినిమాని కర్మ సిద్ధాంతం నేపథ్యంలో తీశానని, ‘కర్మ’ అనే టైటిల్‌ పెట్టా. ప్రేక్షకులు దాన్ని తిట్టు అనుకుని సినిమాకు వెళ్లలేదు (నవ్వులు). నాకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ‘బాయ్స్‌’ సినిమా స్క్రీన్‌ టెస్ట్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. కానీ, నేను వెళ్లలేదు. శంకర్‌గారి దర్శకత్వంలో నటించలేదని ఇప్పటికీ బాధపడుతుంటా. గతంలోనే నేను ఒకరితో రిలేషన్‌లో ఉన్నా. సినీ పరిశ్రమలో ఇంకా పెళ్లికాని హీరోలు చాలా మంది ఉన్నారు. మన కంటే పెద్దవారి వివాహం అయ్యాకే కదా మనం చేసుకునేది (నవ్వుతూ..). దానికి చాలా టైమ్‌ పడుతుందని రిలేషన్‌షిప్‌ను కట్‌ చేశా’’ అని శేష్‌ తెలిపారు.

- Advertisement -

‘‘నాది సినీ నేపథ్యమున్న కుటుంబం కాదు. మా నాన్న దగ్గర నుంచి ఒక్క రూపాయీ తీసుకోకుండా నా కాళ్లపై నేను నిలబడాలనుకున్న సమయంలో చిత్ర పరిశ్రమను ఎంచుకున్నా. నేను హీరోగా నటించిన తొలి సినిమా ఆడలేదు. దాంతో కొన్ని చిత్రాల్లో సహాయ పాత్రలు షోషించా. ఎప్పటికైనా ఓ స్థాయికి వెళ్తా అనే నమ్మకం ఉండేది. నేను దర్శకులు చెప్పిన కథల్లో మంచివి ఎంపిక చేసుకుని నటిస్తుంటా. హీరోయిన్‌ సెలక్షన్‌ కూడా దర్శకులదే (నవ్వులు)’’ అని శర్వానంద్‌ చెప్పారు. బాలకృష్ణ.. ‘మహా సముద్రం’ సినిమా హీరోయిన్‌ అదితీరావు హైదరీ ప్రస్తావన తీసుకురాగా.. ‘సిద్ధార్థ్‌, అదితికి మధ్య ఏం ఉందో నాకు తెలియదు సర్‌. నేనూ సోషల్‌ మీడియాలో సిద్ధు పెట్టిన పోస్ట్‌ చూశా’ అని తెలిపారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here