ఆడియన్స్ ని మోసం చేస్తున్న ‘ఆదిపురుష్’ నిర్మాతలు..డబ్బుల కోసం ఇంత దిగజారిపోవాలా?

- Advertisement -

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం అన్నీ కార్యక్రమాలు ముగించుకొని వచ్చే 16న తేదీన అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పాట జై శ్రీ రామ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కూడా సినిమా పై మంచి బజ్ ని ఏర్పాటు చేసింది. అయితే ఈ చిత్ర నిర్మాతలు బయ్యర్స్ కి ఇవ్వాల్సిన పాత బ్యాలన్స్ డబ్బులను ఎగ్గొట్టేందుకు సరికొత్త ప్లాన్ తో ముందుకు వచ్చారు.

ఆదిపురుష్
ఆదిపురుష్

అసలు విషయానికి వస్తే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ వరుసగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ కలయిక నుండి విడుదలైన సాహూ మరియు రాధే శ్యామ్ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలి బయ్యర్స్ కి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.

Aadipurush

అందువల్ల బయ్యర్స్ పాత డబ్బులు ఇంకా ఇవ్వాలి కాబట్టి ‘ఆది పురుష్’ చిత్రాన్ని తక్కువ రేట్స్ కి అమ్మాల్సిందిగా డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమా నుండి తప్పుకొని 170 కోట్ల రూపాయలకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కి అమ్మేసినట్టు తెలుస్తుంది. ఈ సంస్థ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘బ్రో ది అవతార్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
Prabhas kriti sanon

అయితే ఈ ‘ఆదిపురుష్‘ చిత్రాన్ని 170 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు వస్తున్న వార్తలు నిజం కాదని, యూవీ క్రియేషన్స్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి అమ్మిన విషయమే వాస్తవమే అయ్యినప్పటికీ, ఇలా ఎక్కువ రేట్స్ బయటకి చెప్పడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ భారీ మొత్తం లో అడ్వాన్స్ లు చెల్లిస్తారని, గతం లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ కి ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ దీనికి ఉండరు కాబట్టి కచ్చితంగా భారీ మొత్తం లోనే బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. పాత డిస్ట్రిబ్యూటర్స్ కి పెండింగ్ డబ్బులు చెల్లించకుండా ఇలా రూటు మార్చి యూవీ క్రియేషన్స్ మోసం చేస్తుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here