Dil Raju ని పట్టించుకోని టాలీవుడ్ స్టార్ హీరోలు.. కారణం అదేనా?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ నిర్మాతలలో ఒకడు Dil Raju . ఈయన ప్రొడక్షన్ హౌస్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా సూపర్ హిట్ అనే ముద్ర పడిపోయినట్టే. ఆ రేంజ్ లో తన బ్రాండ్ ఇమేజిని ఏర్పరచుకున్నాడు దిల్ రాజు.ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని ప్రారంభించిన దిల్ రాజు, ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగాడు.తొలి సినిమాని నితిన్ మరియు వీవీ వినాయక్ కాంబినేషన్ లో తీసాడు.

Dil Raju
Dil Raju

ఆ చిత్రం గ్రాండ్ హిట్టవ్వడం తో ‘దిల్’ రాజు గా మారిపోయాడు. ఆ తర్వాత వరుసగా ఆయన ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసి నేడు ఈ స్థాయిలో ఉన్నాడనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, మన అందరికీ తెలుసు. అయితే అలాంటి దిల్ రాజుని ఇప్పుడు స్టార్ హీరోలెవ్వరూ కూడా పట్టించుకోవడం లేదనే రూమర్ సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది.

Dil Raju

అందుకు కారణం ‘మైత్రీ మూవీ మేకర్స్’ ప్రభంజనమే అని తెలుస్తుంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వీళ్ళ బ్యానర్ లోనే నిర్మితమవుతుంది.దిల్ రాజు ఫోకస్ టాలీవుడ్ నుండి షిఫ్ట్ అయ్యి బాలీవుడ్ మరియు కోలీవుడ్ వైపు మరలుతుంది. ఆ స్పేస్ ని మైత్రీ మూవీ మేకర్స్ సరిగ్గా ఉపయోగించుకుంటూ ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగింది. ప్రస్తుతం దిల్ రాజు చేతిలో రామ్ చరణ్ – శంకర్ మూవీ మాత్రమే ఉంది .ఇదొక్కటే ఆయన చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్.

- Advertisement -
Dil Raju

రీసెంట్ గానే ఆయన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ‘వారిసు’ అనే చిత్రం తీసి గ్రాండ్ హిట్ కొట్టాడు. తెలుగు లో ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే రెండవ సినిమాని నిర్మించబోతున్నాడని టాక్ ఉంది కానీ, ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. ఇక మిగిలిన స్టార్ హీరోలు దిల్ రాజు వైపు కూడా చూడడం మానేశారు. ‘మైత్రీ మూవీ మేకర్స్‘ బ్యానర్ లో పని చెయ్యడం చాలా సుఖంగా ఉంటుందని, హీరోలు అడిగినంత పారితోషికాలను ఎలాంటి బేరం చెయ్యకుండా ఇచ్చేస్తారని, కానీ దిల్ రాజు దగ్గర మాత్రం అలాంటి లెక్కలు ఉండవని, అందుకే స్టార్ హీరోలు అతనితో సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపడం లేదని టాలీవుడ్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here