సమంత ఇంతమందిని నాశనం చేసిందా.. వెలుగులోకి నిజాలు

- Advertisement -

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో భారీ బడ్జెట్ తో రిలీజ్ అయ్యి అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయిన సినిమాల్లో ముందు నిలిచే సినిమా శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఏకంగా 70 కోట్లకు పైగా బడ్జెట్ ను పెట్టి నిర్మించగా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించ లేక పోయిన ఈ సినిమా ఎపిక్ డిసాస్టర్ గా పరుగును పూర్తీ చేసుకుంది.ఇందులో మలయాల నటుడు అయిన దేవ్ మోహన్ హీరో గా నటించిన సంగతి తెలిసిందే.

సమంత
సమంత

ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. సినిమా ఫ్లాప్ అవడం తో కొంతమంది సమంత పై సోషల్ మీడియా లో దారుణంగా ట్రోల్స్ చేశారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో ప్రతి ఒక్కరు మరోసారి ట్రోలింగ్ మొదలుపెట్టారు. అంతే కాదు ఇప్పటి వరకు సమంత నటించిన సినిమాల్లో ప్లాప్ అయినవి బయటకు తీశారు. ఆ సినిమా ఎవత పెట్టి తీశారు. ఎన్ని డబ్బులు వచ్చాయో లెక్కలెడుతున్నారు. ఇంత మందిని నాశనం చేశావంటూ దారుణంగా మాట్లాడుతున్నారు. మరికొందరేమో నాగచైతన్య ఫాన్స్ ఇలా చేస్తున్నారని చెబుతున్నారు.

Samantha

శాకుతలంని నాసిరకంగా ఉందని అంటున్నారు. అలాంటి సినిమాకు అంత బడ్జెట్ ఎలా పెట్టారు అంటూ ట్రోల్ చేస్తున్నారు, ఇక సమంత డబ్బింగ్, సెట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా అన్నింటిపై కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తూ ఉండగా.. థియేటర్స్ లో ఫస్ట్ రౌండ్ ట్రోల్స్ ని ఫేస్ చేసిన సినిమా అట్టర్ డిసాస్టర్ అవ్వగా ఇప్పుడు డిజిటల్ లో సెకెండ్ రౌండ్ ట్రోల్స్ పుండు మీద కారం చల్లినట్లు అవుతుంది. మొత్తం మీద రీసెంట్ టైంలో బడ్జెట్ పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన శాకుంతలం బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు డిజిటల్ లో కూడా ఎక్స్ ట్రీం నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here