సాయి పల్లవి మాములుది కాదుగా.. ఏడో క్లాసులోనే లవ్‌ చేసిందిట

- Advertisement -

తెలుగు, మ‌ల‌యాళ‌, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు సాయిప‌ల్ల‌వి (Sai Pallavi). శ్యామ్ సింగ రాయ్ సినిమాతో నార్తిండియా ప్రేక్ష‌కుల‌కు కూడా ద‌గ్గ‌రైంది ఈ భామ‌. భాష‌, హిట్టు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది. చివరగా రానాతో క‌లిసి విరాట‌ప‌ర్వం (Virata Parvam) సినిమా చేసింది. తర్వాత గార్గి తో అలరించింది. ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిలో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ను అందుకోలేక‌పోయినా..విమ‌ర్శ‌కుల ప్రశంస‌లు అందుకుంది.

సాయి పల్లవి
సాయి పల్లవి

విరాట‌ప‌ర్వంలో ర‌వ‌న్న త‌ల్లి రాసిన ఉత్త‌రాన్ని అత‌న్ని క‌లిసి అందించేందుకు వెన్నెల చాలా రిస్క్ చేస్తుంది. అయితే నిజ‌జీవితంలో ల‌వ్ లెట‌ర్ (love letter) రాసిందట ఈ అమ్మడు. చిన్న‌నాటి సంఘ‌ట‌నను ఒక‌టి షేర్ చేసుకుంది.. మథర్స్‌ డే సందర్భంగా గుర్తు చేసుకుంది. సాయిప‌ల్ల‌వి స్కూల్ స్టేజ్‌లో ఓ అబ్బాయికి రాసిన ల‌వ్ లెట‌ర్ ఆమె త‌ల్లిదండ్రుల కంట ప‌డింద‌ట‌. నా చిన్న త‌నంలో ఓ అబ్బాయికి లేఖ రాసిందట. అపుడు నేను ఏడో త‌ర‌గ‌తి చదువుతుందట. ఈ విష‌యం తెలిసి అమ్మానాన్న న‌న్ను చాలా బాగా కొట్టారట. ఈ విషయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

saipallavi

అసలు సాయి పల్లవి ఏం చెప్పిందంటే.. ఏడో తరగతిలో ఉన్నప్పుడు మా క్లాస్‌లో ఒక అబ్బాయి నాకు బాగా నచ్చాడు. ఈతడితో ప్రేమలో పడ్డాను. ఆ విషయం చెప్పాలని ఒకరోజు ప్రేమలేఖ రాశా. కానీ, అది అతనికి ఎలా ఇవ్వాలో తెలియక పుస్తకంలో దాచిపెట్టాను. అనుకోకుండా ఆ లెటర్‌ మా అమ్మ కంట పడింది. దాంతో చెప్పలేనంత కోపం వచ్చి నన్ను చితక్కొట్టేసింది. అమ్మ కొట్టడం అదే మొదలూ, చివరా. ఇప్పటి వరకూ మళ్లీ తనకి కోపం తెప్పించే పనులు చేయలేదు. అని చెప్పింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here