అక్కినేని ఇంటి అమ్మాయినే లైన్లో పెట్టిన టాలీవుడ్‌ హీరో.. త్వరలో ఆపని కూడా..!

- Advertisement -

తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు. హీరో నాని నిర్మాతగా చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్2 విజయం సాధించాక ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరోపై కొద్దిరోజులుగా రూమర్స్‌ గుప్పుమంటున్నాయి. ఈ హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఏకంగా అక్కినేని ఇంటి అమ్మాయినే లైన్లో పెట్టాడని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

 అడవి శేషు
అడవి శేషు

అక్కినేని నాగార్జున మేనకోడలు, నాగేశ్వరరావు మనవరాలు అయిన సుప్రియతో కలిసి అడవి శేషు త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. 2019 నుంచి వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. అక్కినేని వారి ఇంట జరిగే శుభకార్యాల్లో శేష్ ​కనిపించడంతో పాటు వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి వీరి ప్రేమ కబుర్లు చక్కర్లు కొడుతున్నాయి. సుప్రియ, అడవి శేష్ పెళ్లికి శేష్ కుటుంబం ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 16న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఏకం కాబోతున్నారని తెలుస్తోంది. అయితే అడవి శేష్ నుండి, అక్కినేని ఫ్యామిలీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి వీరి పెళ్లి వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది.

Adivi sesh supriya

సురేంద్ర యార్లగడ్డ, సత్యవతి యార్లగడ్డ కూతురు సుప్రియ. తల్లి సత్యవతి మరణించారు. పవన్ కళ్యాణ్ నటించిన అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాలో సుప్రియ నటించింది. 1997 ఆమె ఆహా చిత్రాన్ని నిర్మించారు. సినిమాలకు దూరమైన తర్వాత ఆమె ‘ఇష్టం’ సినిమా హీరో చరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు మనస్పర్థలు రావడంతో అతడితో విడిపోయింది. తర్వాత అనారోగ్య సమస్యలతో చరణ్ చనిపోయారు. గూఢచారి సినిమాతో మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చింది సుప్రియ. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారట. వీరిద్దరి పెళ్లి వార్తలపై సుప్రియ కుటుంబీకులు లేదా అడవి శేష్‌ క్లారిటీ ఇస్తే ఈ వార్తలపై మరింత స్పష్టత వస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here