ఆగలేకపోతున్న సమంత.. ఐస్ గడ్డల్లో కూర్చింది పాపం..

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు ఉన్నాయి. ఇటీవలే శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన రాబోయే సినిమాలపై ఫోకస్ పెట్టింది సామ్. ఓవైపు మయోసైటిస్ సమస్యతో పోరాడుతూనే మరోవైపు సిటాడెల్ చిత్రీకరణలో పాల్గొంటుంది. ఈ సిరీస్ కోసం కఠినమైన స్టంట్స్ చేస్తుంది. దీనికి ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఒరిజినల్ సిరీస్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ నటించగా… ఇండియన్ వెర్షన్ లో వరుణ్ దావన్, సమంత జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ చిత్రీకరణ ముంబైలో జరుగుతుంది.

సమంత
సమంత

ఇందులో భారీ యాక్షన్‌ సన్నివేశాలున్నాయి. ఇక వీటి కోసం ఆమె బాగా కష్టపడుతోంది. ఆ అలసట తీరడం కోసం ఐస్‌ బాత్‌ చేస్తుందట. ఐస్‌ గడ్డలు ఉన్న టబ్‌లో తాను కూర్చున్న ఫొటోను షేర్‌ చేసిన ఆమె.. ఇది టార్చర్‌ టైం అని పేర్కొంది. దానికి ‘యాక్షన్‌ మోడ్‌ ఆన్‌’, ‘ఐస్‌ బాత్‌ రికవరీ’ అనే హ్యాష్‌ ట్యాగ్‌లను జోడించింది. ఈ పోస్ట్ చూసిన వారంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘సామ్‌ నువ్వు గ్రేట్‌’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆగలేకపోతుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇలా ఐస్ టబ్లో తిప్పలుపడుతుందంటూ రాసుకొస్తున్నారు.

Samantha

సమంత ట్రీట్మెంట్ మాత్రం ఇంకా పూర్తి అవ్వలేదట. మయోసైటిస్ నుంచి కోలుకునేందుకు ట్రీట్మెంట్ తీసుకుంటూనే సినిమా నిర్మాతలు కోసం షూటింగ్స్ కూడా హాజరవుతూ వస్తుంది. ఇటీవల ఆక్సిజన్ మాస్క్ పిక్ తో ఉన్న ఒక పిక్ ని షేర్ చేసి హైపర్బేరిక్ థెరపీ (Hyperbaric Oxygen Therapy) తీసుకుంటున్నట్లు తెలిపింది. కండరాల వాపు, ఇన్ఫెక్షన్స్, పాడైన కండరాలను బాగుచేయడంలో హైపర్బేరిక్ థెరఫీ కాపాడుతుందని వెల్లడించింది. అందుకే ఇలా ఐస్ బాత్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలియజేసింది. కాగా సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) ఖుషీ (Kushi) సినిమా, ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ తో సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఖుషీలో రొమాంటిక్ రోల్ లో కనిపిస్తుండగా, సిటాడెల్ స్పై పాత్రలో యాక్షన్ ఫైట్స్ తో అదరగొట్టబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here