Samantha: తెరుచుకున్న సమంత గుడి.. ఖర్చు తెలిస్తే షాక్ అవుతారు

- Advertisement -

Samantha: గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న స్టార్ హీరోయిన్‌ సమంతకు ఫ్యాన్ గుడి కట్టించాడు. ఏపీలోని బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ సమంత బర్త్‌డేకు వినూత్నంగా గిఫ్ట్ ఇవ్వనున్నాడు. తన ఇంటిలోనే సమంత విగ్రహం తయారు చేయించి గుడి కట్టాడు. గత రెండు రోజుల నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోన్న విషయం తెలిసిందే. ఈరోజు సమంత పుట్టిన రోజు సందర్భంగా గుడిని ఓపెన్ చేశారు. దాన్ని చూసి అందురూ షాక్ అవుతున్నారు.

Samantha
Samantha

సమంత వ్యాధి నుంచి కోలుకున్నందుకు ఇప్పటికే తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడప దర్గాకు మొక్కుబడి యాత్ర కూడా నిర్వహించినట్లు సందీప్ తెలిపారు. సమంత పుట్టినరోజు సందర్భంగా గుడి ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. గతంలో కూడా ఓ వీరాభిమాని సీనియర్ నటి ఖుష్బూ సుందర్ కూడా ఇలాగే గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. సమంత గుడి ఓపెనింగ్ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు. నటి విగ్రహంతో ఫొటోలు దిగారు. అనంతరం సామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సందీప్‌ కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచాడు. సమంతకు వీరాభిమాని అయిన సందీప్‌.. ప్రత్యూష ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చిన్నపిల్లల కోసం ఆమె చేస్తోన్న సేవలకు ముగ్ధుడయ్యాడు. ఈ క్రమంలోనే ఆమె గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసం గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు.

temple

రూ.3.7లక్షల ఖర్చు పెట్టి ఇంటి ఆవరణలోనే ఈ గుడిని నిర్మించాడు. అంతేకాదు ఈ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా జరిపాడు. ప్రత్యేక పూజలు చేశాడు. ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపాడు. కెరీర్‌ విషయానికి వస్తే.. ‘శాకుంతలం’ పరాజయంతో సమంత ఆశలన్నీ తన తదుపరి ప్రాజెక్ట్‌ ‘సిటాడెల్‌’ పైనే పెట్టుకున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌కు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. దీని కోసం ఆమె ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. మరోవైపు, సమంత గత కొంతకాలంగా మయోసైటిస్‌తో పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here