అది అడ్డుపెట్టుకుని.. పవిత్రా లోకేశ్ కెరీన్ నాశనం చేయాలనుకున్నారట

- Advertisement -

పవిత్రా-నరేశ్.. ఇప్పుడు టాలీవుడ్​లో వీళ్లదే హాట్ టాపిక్. మొన్నటి వరకు పెళ్లి విషయంలో ఈ ఇద్దరూ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు వారి పెళ్లిపై వస్తున్న సినిమా ప్రచారంలో భాగంగా లైమ్ లైట్​లో కనిపిస్తున్నారు. నరేశ్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త మూవీ మళ్లీ పెళ్లి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమా పవిత్ర నరేశ్​లో లవ్ స్టోరీయేనని ప్రేక్షకులు భావిస్తున్నారు. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రానికి ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహించారు. మే 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి, తన పర్సనల్​ లైఫ్​లో జరుగుతున్న కొన్ని విషయాల గురించి పవిత్ర లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

పవిత్రా లోకేశ్
పవిత్రా లోకేశ్

నరేశ్​ గురించి మాట్లాడుతూ పవిత్రా లోకేశ్.. ‘ఎంత సీరియస్ విషయాన్నయినా నరేశ్ చాలా లైట్ తీసుకుంటారు. అలాగే సీరియస్‌గా దానికి బదులిస్తారు. ఆ లక్షణం నాలో లేదు. చిన్న విషయాలనూ నేను సీరియస్‌గా తీసుకుంటాను. ఇక, ఆయన ప్రస్తుతం గురించే ఆలోచిస్తారు. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలనుకుంటారు. రేపు అనేది వచ్చాక చూసుకుందామంటారు. ఈ విషయాన్ని ఆయన నుంచే నేర్చుకున్నాను. అంతేకాకుండా, ఆయన నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దీనికంటే కావాల్సింది ఏముంది.’ అంటూ చెప్పుకొచ్చారు.

నటి పవిత్రా లోకేశ్
నటి పవిత్రా లోకేశ్

ఇక పవిత్రా లోకేశ్ మూడు పెళ్లిళ్ల గురించి చాలా చర్చ నడుస్తోంది. మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి యాంకర్ ఆమెను ప్రశ్నించగా.. ‘పెళ్లి విషయం ఒక్కటే కాదు సమాజంలో ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. అయితే సమాజంలో ఎవరి ఆలోచన, అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. మా విషయంలో కొన్ని సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా నా విషయానికే వస్తే .. కొందరు పరిస్థితులని అడ్డుపెట్టుకొని నన్ను తప్పుగా చూపించారు. నా వ్యక్తిత్వానికి హాని కలిగించి, నా కెరీర్‌పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారు. అలాంటి పరిస్థితి నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఒంటరిగా ఉండుంటే ఆత్మహత్య లేదా ఇంట్లో కూర్చోవాల్సి వచ్చేది. ఆ పరిస్థితి నుంచి బయటికి వచ్చానంటే కారణం నరేశ్‌. ఆయనే నాకు అండగా నిలబడ్డారు. నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు.’ అని పవిత్రా లోకేశ్ తెలిపారు.

- Advertisement -

ఇక చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సినిమాలో హీరోయిన్​గా నటించడంపై పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ.. ‘నటిగా కెరీర్‌ మొదలుపెట్టిన నాటి నుంచి మంచి పాత్రలు మాత్రమే చేయాలనుకున్నా. హీరోయిన్‌గానే సినిమాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కెరీర్‌ ఆరంభంలోనే సుప్రసిద్ధ దర్శకులు గిరీశ్‌ కాసరవెల్లి దర్శకత్వంలో హీరోయిన్‌గా రెండు సినిమాలు చేశాను. అది నా అదృష్టం. ఆ తర్వాత నాకు నచ్చిన పాత్రలను చేస్తూ ఇక్కడి వరకూ వచ్చాను. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించానని’ అన్నారు.

అయితే మళ్లీ పెళ్లి పవిత్రా-నరేశ్​ల బయోపిక్ అని బయట చర్చ జరుగుతోంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘బయోపిక్ అనేది చాలా పెద్ద పదం. ఈ సినిమా బయోపిక్ కాదు. ఇది కేవలం నేటి సమాజానికి అద్దం పట్టే సినిమా మాత్రమే. ప్రేక్షకులు తప్పకుండా దీనికి కనెక్ట్‌ అవుతారు.’ అని చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here