పిల్లల్ని నవ మాసాలు నా కడుపులో మొయ్యకపోయినా తల్లిని అయ్యాను.. సరోగసి పై నయనతార ఎమోషనల్ కామెంట్స్

- Advertisement -

సౌత్ ఇండియా లోనే సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు నయనతార. మన చిన్నతనం లో ఉన్నప్పుడు ఎంత క్రేజ్ మరియు డిమాండ్ తో ఇండస్ట్రీ లో కొనసాగేదో, ఇప్పటికీ అంతే క్రేజ్ తో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.అయితే నటిగా ఈమెకి ఎంత మంచి పేరుందో, కాంట్రవర్సీలు కూడా చాలానే ఉన్నాయి. శింబు మరియు ప్రభుదేవా వంటి వారితో ప్రేమాయణం నడిపి అప్పట్లో సంచలనం సృష్టించింది.

నయనతార
నయనతార

పెళ్లి దాకా వెళ్లిన వీళ్లిద్దరి వ్యవహారం, ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, మధ్యలోనే విడిపోవాల్సి వచ్చింది . ఆ తర్వాత ప్రముఖ తమిళ దర్శకుడు సతీష్ విఘ్నేష్ ని ప్రేమించి 5 ఏళ్ళ పాటు డేటింగ్ చేసుకొని గత ఏడాది జూన్ 10 వ తారీఖున వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళైన నాలుగు నెలలకే ఈ దంపతులు ఇద్దరు కవల పిల్ల్లలకు జన్మని ఇవ్వడం అప్పట్లో పెద్ద వివాదాస్పదం గా మారింది.

Nayathara vignesh shivan

సరోగసి పద్దతి లో మన భారత దేశం లో పిల్లల్ని కనడం అనేది చట్టరీత్యా నేరం, అయ్యినప్పటికీ కూడా నయనతార దంపతులు చట్టాన్ని ఉల్లంగిస్తూ సరోగసి ద్వారా బిడ్డల్ని కన్నారు అంటూ అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. కోర్టు లో కేసు కూడా నడవగా, నయనతార దంపతులు అలా ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో తగిన కారణాలు ఆధారాలతో సహా కోర్ట్ కి సబ్మిట్ చెయ్యడం తో ఈ సమస్య సర్దుమణిగింది.

- Advertisement -
nayanthara kids

ఇక రీసెంట్ గానే నయనతార ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన పిల్లల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది.’ఎప్పుడైతే నా జీవితం లోకి ఆ ఇద్దరు పిల్లలు వచ్చారో, నా లైఫ్ మొత్తం మారిపోయింది. నవమాసాలు నా కడుపులో బిడ్డల్ని మొయ్యలేకపోయినా కూడా, అమ్మతనం ని ఫీల్ అవుతున్నాను. ప్రతీ రోజు వాళ్ళతోనే నా రోజు మొదలు అవుతుంది, వాళ్ళతోనే ముగుస్తుంది’ అంటూ నయనతార చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడుస్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here