నయనతార వల్ల ఎన్నో అవమానాలు పడ్డాను.. సంచలన పోస్ట్ పెట్టిన ఆమె భర్త

- Advertisement -

నయన్ విఘ్నేశ్ లవ్ స్టోరీ, పెళ్లి మీద లెక్కలేనన్ని రూమర్లు రాగా.. గతేడాది వీళ్లిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. గతేడాది జూన్‌ 9న వీరిద్దరి పెళ్లి మహాబలిపురంలో గ్రాండ్‌గా జరిగింది. తాజాగా నయన్ దంపతులు పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు. తాజాగా వీరి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ రోజున తమ పిల్లలిద్దరినీ పరిచయం చేశారు. తమ మొదటి వివాహా వార్షికోత్సవం సందర్భంగా తమ పిల్లలను పరిచయం చేసారు. వీళ్లిద్దరు ఎంతో క్యూట్‌గా ఉన్నారని నెటిజన్స్ అభివర్ణిస్తున్నారు. నయనతార తన పొత్తిళ్లలో ఉన్న ఇద్దరు బిడ్డలను చూపించింది.

నయనతార
నయనతార

నేడు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన కుటుంబాన్ని ఉద్దేశిస్తూ విగ్నేశ్‌ పెట్టిన పోస్ట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘‘నువ్వు నా జీవితంలోకి వచ్చి అప్పుడే ఏడాది అయిపోయింది. ఈ సంవత్సరంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం. ఎన్నో ఊహించని పరాజయాలు.. ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. ఇలాంటి ఎన్ని చికాకులు ఉన్నా ఒక్కసారి ఇంటికి వచ్చి నిన్నూ పిల్లల్ని చూడగానే అన్నీ మర్చిపోతాను. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబం ఇచ్చే బలం మరేదీ ఇవ్వలేదు. మన పిల్లలు ఉయిర్‌, ఉలగమ్‌లకు మంచి జీవితాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. నిన్ననే పెళ్లి చేసుకున్నట్లు ఉంది. అప్పుడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నాను. మనమిద్దరం కలిసి సాధించడానికి చాలా ఉన్నాయి. మన ఆనందమైన జీవితంలోకి మరో ఏడాదికి స్వాగతం పలుకుదాం’’ అంటూ నయనతారకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

Nayanthara Vignesh shivan

ప్రేమించి పెళ్లి చేసుకున్న నయన్- విగ్నేష్ దంపతులు ఇంతలోనే పేరెంట్స్ కావడాన్ని బట్టి చూస్తే.. పెళ్ళికి ముందే నయన్ గర్భం ధరించిందని చెప్పుకోవచ్చు. ఇలా నయన్ దంపతుల ప్రేమ సంగతులు, డేటింగ్ వ్యవహారం పలు చర్చలకు తావిచ్చింది. పెళ్లి తరువాత నయనతార విఘ్నేశ్ శివన్ తిరుమలలో స్వామి వారి దర్శనానికి వెళ్లారు. మాఢవీధుల్లో నయన్ చెప్పులతో నడవడం, గుడి ముందే ఫోటో షూట్లు చేయడంతో వివాదాంలో చిక్కుకుంది. తెలిసి ఆ తప్పు చేయలేదని, అనుకోకుండా జరిగిందని, అందరూ తమను క్షమించాలని అభ్యర్థిస్తూ ఆ సమయంలో విఘ్నేశ్ శివన్ ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here