Nayanthara : కేవలం 50 సెకండ్ల యాడ్ కి రూ. 5 కోట్లా.. నయన్ రేంజ్ వేర‌బ్బా..

- Advertisement -

Nayanthara : సినీ పరిశ్రమకు చెందిన కొందరు సెలబ్రిటీలు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్, వ్యాపారాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరి యాడ్స్ లో నటించేందుకు వాళ్లు తీసుకునే రెమ్యునరేషన్ చూస్తే.. కళ్లు తెరవాల్సిందే. తాజాగా లేడీ సూపర్‌స్టార్ నయనతార 50 సెకన్ల యాడ్ చేసింది.. ఆ యాడ్ కోసం ఆమె అందుకున్న రెమ్యూనరేషన్ ఎంత‌నేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నయన్ హీరోలతో సమానంగా స్టార్‌డమ్‌ను అనుభవిస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా నయన్ రికార్డుల్లోకి ఎక్కింది. అయితే నయన్ కి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ఇంత డిమాండ్ ఉన్నా ఈ బ్యూటీ పెద్దగా యాడ్స్ చేయదు.

దీనికి కారణం తెలియనప్పటికీ.. ఈ అమ్మడు అప్పుడప్పుడు కొన్ని యాడ్స్ లో మెరిసిపోతుంది. రీసెంట్ గా ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన నయన్.. ఆ యాడ్ కోసం భారీ మొత్తం రాబట్టింది. తాజాగా టాటా స్కై ప్రమోషనల్ యాడ్‌లో నయనతార నటించినట్లు తెలుస్తోంది. కేవలం 50 సెకన్ల ఈ యాడ్ కోసం నయన్ ఏకంగా రూ. 5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ వార్త కాస్త వైరల్ గా మారడంతో స్టార్ హీరోలు కూడా ఇంత భారీ రెమ్యూనరేషన్ తీసుకోరు మేడమ్ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు నయన్ డిమాండ్ కూడా అలానే ఉందని రాస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ అమ్మాయి షారుఖ్ సినిమా జవాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా రూ. 1000 కోట్లు వసూలు చేయడంతో.. బాలీవుడ్‌లో డిమాండ్‌ భారీగా పెరిగింది. అలాగే కేవలం 50 సెకన్ల ప్రకటన కోసం ఎలా చెల్లించాలి అనే దానిపై మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో పంచుకోండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here