పెళ్లైన మాస్ హీరోతో హీరోయిన్ మీరా జాస్మిన్ ప్రేమాయణం.. ఎందుకు విడిపోయారు ..?

- Advertisement -

మీరా జాస్మిన్.ఈ హీరోయిన్ ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు.ఎంతో అందంగా.అమాయకంగా కనిపించే ఈ మీరా జాస్మిన్ మంచి నటనతో ఒకానొక సమయంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.మంచి మంచి సినిమాల్లో నటించింది ఉన్నట్టుండి పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది.అయితే ఇప్పుడు ఆమె పేరు వార్తల్లో తెగ వినిపిస్తోంది. భద్ర సినిమా వచ్చి 17 పూర్తయిన సందర్భంగా ఇటీవల పెద్ద కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ అమ్మడి గురించి నెట్టింట తెగ వెతికేశారు.

మీరా జాస్మిన్
మీరా జాస్మిన్

అప్పుడు ఓ విషయం తెలిసింది. భద్ర సినిమా టైంలో రవితేజకు, మీరా జాస్మిన్ కు మధ్యలో ఏదో నడిచిందని టాక్. పెళ్లయ్యాక రవితేజ భద్ర సినిమాలో నటించిన కొన్ని రోజులు ప్రేమాయణం నడిపించారని వార్తలు వినిపించాయి. అంతేకాదు వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా ఉండేదంటే మీరా జాస్మిన్ (Meera jasmine) తాను ఏ సినిమాలో నటించాలి అనుకున్న కూడా ముందుగా రవితేజ పర్మిషన్ తీసుకునేదట. అంతలా కనెక్ట్ అయిందట.కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారట. ఇక అప్పట్లో వీరిద్దరి ప్రేమ విషయం గురించి ఇండస్ట్రీలో ఉన్న చాలామంది గుసగుసలు పెట్టుకునేవారు.

పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమా వచ్చిందో అప్పటినుండి రవితేజ ఇమేజ్ మారిపోయింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయారు. అలాగే ఆ తర్వాత ఖడ్గం (Khadgam) ,అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ పడడంతో రవితేజ మళ్లీ ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోకుండా తన కెరియర్ ఒక్కసారిగా పైకి ఎదిగాడు.దాంతో ప్రస్తుతం అప్పటినుండి ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. అయితే అలాంటి రవితేజ (Raviteja) ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే కళ్యాణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here