బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన రోజా పూలతో కీర్తి క్యూట్ పోజులు.. ఫొటోలు వైరల్

- Advertisement -

కీర్తి సురేశ్ మరోసారి సోషల్ మీడియాలో తన హవా చూపించింది. తాజాగా ఈ బ్యూటీ ఫొటోషూట్తో అలరించింది. గులాబీ రంగు సల్వార్ కమీజ్లో కీర్తి క్యూట్ పోజులతో కవ్వించింది. చేతిలో రోజా పూలు పట్టుకుని మెస్మరైజింగ్ స్మైల్తో మైమరపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

కీర్తి సురేశ్
కీర్తి సురేశ్

మరికొందరేమో కచ్చితంగా కీర్తికి ఆ రోజా పూలు బాయ్ ఫ్రెండే ఇచ్చి ఉంటాడని కామెంట్లు చేస్తున్నారు. ప్రియుడిచ్చిన పూలు కాబట్టే అంత ప్రేమగా వాటిని పట్టుకుని ఫొటోలు దిగిందంటూ మరికొందరు నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఆ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు, దుబాయ్ వ్యాపారవేత్త ఫర్హాన్ బిన్ లియాఖత్‌తో దిగిన ఫొటోను ఇటీవలే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కీర్తి షేర్ చేసింది. దీంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

- Advertisement -

 ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. కీర్తి సురేశ్.. ఇటీవలే తెలుగులో దసరా సినిమాతో సూపర్ హిట్ సాధించింది. ఇక కీర్తి ఇటీవలే వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చింది. ప్రస్తుతం కీర్తి తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టింది.

ఈ బ్యూటీ త్వరలోనే ఓపొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ‘మమనన్’లో కనిపించనుంది. సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కీర్తితో పాటు వడివేలు, ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది జూన్ 29న థియేటర్లలో విడుదల కానుంది. దీనితో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోళా శంకర్‘ చిత్రంలో కూడా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ చిత్రంలో తమన్నా, చిరంజీవి కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ చిరుకి చెల్లెలుగా నటించినట్లు సమాచారం. ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here