గుంటూరు కారం సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా అఫీషియల్ టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ ను రీసెంట్ గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి అనుకున్న దాని కన్నా కూడా చాలా మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా యూట్యూబ్ లో ఈ గ్లిమ్స్ వ్యూస్ పరంగా రికార్డులను క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన గ్లిమ్స్ పరంగా ఈ గుంటూరు కారం గ్లిమ్స్ కి 24 గంటల్లో ఆల్ టైం రికార్డ్ అనిపించే రేంజ్ లో వ్యూస్ సొంతం అయ్యి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది.

మహేష్ బాబు
మహేష్ బాబు

అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక విషయం లో చాలా నిరాశకి గురయ్యారు. ఎందుకంటే ఈ టీజర్ కి అతి తక్కువ లైక్స్ రావడమే. ఒక అద్భుతమైన టీజర్ కట్ కి, స్టార్ హీరో కి రావాల్సినంత లైక్స్ రాలేదని, వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డు వచ్చినప్పటికీ అది కేవలం యాడ్స్ వల్ల వచ్చిందని , ఒక క్రేజీ కాంబినేషన్ నుండి వచ్చిన టీజర్ కి లైక్స్ రాకపోవడం చూస్తుంటే మహేష్ క్రేజ్ తగ్గిపోయిందా? అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ మొదట అనుకున్నది మహేష్ ను కాదట.

ఎన్టీఆర్
ఎన్టీఆర్

ఈ సినిమా ఎన్టీఆర్ తో చేయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావించి ఈ సినిమా కథను ఎన్టీఆర్ కి వినిపించారట. RRRసినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమాలోనే చేయాల్సి ఉంది. కథ మొత్తం విన్నటువంటి ఎన్టీఆర్ కథలో కొన్ని మార్పులు చెప్పడంతో త్రివిక్రమ్ కూడా అందుకు అనుకూలంగా కొన్ని మార్పులు చేశారట. అయినప్పటికీ స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ సాటిస్ ఫై కాకపోవడంతో ఈయన కొరటాల శివ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here