ఆ డైరెక్టర్‎తో చచ్చినా సినిమా చేయనంటున్న హీరో విశాల్

- Advertisement -

తెలుగు వాడైనా తమిళంలో సినిమాలు చేస్తూ కోలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా విజయవంతమయ్యాయి. తాజాగా ఆయన నటించిన‌ మార్క్ అంటోని సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్ర బృందం ప్రమోషన్లను బాగానే చేసింది. టైం ట్రావెల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అంతే కాకుండా సిల్క్ స్మితను పోలి ఉండే అమ్మాయిని తీసుకొచ్చి చేయించడం సినిమాకే హైలెట్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో విశాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మాటల మధ్య విశాల్ డిటెక్టివ్ సినిమా డైరెక్టర్ మాస్కిన్‌పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

విశాల్
విశాల్

విశాల్‌ మాట్లాడుతూ డైరెక్టర్ మాస్కిన్ తో మరో సారి కలిసి పని చేసే అవకాశమే లేదన్నారు. కోలీవుడ్ లో తప్పరివాల‌న్‌ తెలుగులో డిటెక్టివ్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక తప్పరివాల‌న్ 2 కూడా వీరి కాంబోలోనే వస్తుందన్న వార్త వైరల్ అయింది. కానీ సెట్స్ పై ఉండగానే సినిమా ఆగిపోయింది. తప్పరివాల‌న్ 2 సినిమా విషయంలో మాస్కిన్‌ పెట్టిన ఇబ్బందులకు లండన్ రైల్వే స్టేషన్ లో కూర్చుని చాలా బాధపడ్డానని.. తాను ఎప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోలేన్నాను. తన స్థానంలో ఇంకెవరైనా పెద్ద వాళ్లు ఉన్నట్లైతే అక్కడే హార్ట్ ఎటాక్ తో చచ్చిపోయేవారన్నారు. తాను కాబట్టి మాస్కిన్ చేసిన పనులన్నీ నష్టాన్ని తట్టుకోగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ మాస్కిన్‌తో కలిసి తప్పరివాల‌న్ 2 మ‌ళ్లీ స్టార్ట్ చేసినా అది పూర్తికాదన్నారు. వచ్చే సంవత్సరం తానే స్వయంగా తప్పరివాల‌న్ 2 ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకుంటానన్నాడు. విశాల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలోనే కాక సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్ అయ్యాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here