ఆ ఒక్క క్యారక్టర్ నా జీవితాన్ని నాశనం చేసేసింది అంటూ హీరోయిన్ రాశీ షాకింగ్ కామెంట్స్

- Advertisement -

హీరోయిన్ రాశీ బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హోమ్లీ హీరోయిన్ గా ఎదిగిన నటి రాశీ.అందం తో పాటుగా అద్భుతమైన అభినయించగల సత్తా ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రాశీ, ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలతోనే నటిస్తూ వచ్చిన రాశీ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. దాదాపుగా 50 కి పైగా సినిమాల్లో నటించిన రాశీ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా, క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణించింది.

హీరోయిన్ రాశీ
హీరోయిన్ రాశీ

అయితే గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రాశి మాట్లాడుతూ తన కెరీర్ లో నిజం సినిమా ని ఎప్పటికీ మర్చిపోలేను,ఈ చిత్రం వల్ల నా జీవితమే మారిపోయింది అంటూ చెప్పుకొచ్చింది.ఎల్లపుడూ పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన రాశీ ఈ చిత్రం లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆడియన్స్ కి కూడా ఈమె పాత్ర పెద్ద షాక్.

డైరెక్టర్ తేజ నన్ను మోసం చేసి ఈ పాత్రని చేయించాడని, తొలుత పాజిటివ్ క్యారక్టర్ అని చెప్పి, లొకేషన్ కి వెళ్లిన తర్వాత మాట మార్చాడని, ఇక ఒప్పేసుకున్న ప్రాజెక్ట్ కాబట్టి తప్పక చెయ్యాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఈ పాత్ర కారణం గా ఆమెకి రెగ్యులర్ గా వచ్చే పాత్రలు మిస్ అయ్యాయి అట.

- Advertisement -

మహేష్ బాబు మీద ఉన్న అభిమానం తో ఈ సినిమా ఒప్పుకుందట, ఇందుకోసం ఆమె రెండు ప్రాజెక్ట్స్ వదులుకున్నానని, ఆ తర్వాత అవి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా అయ్యాయి అని, వేరే లెవెల్ లో ఉండాల్సిన నా కెరీర్ ఇలా యూ టర్న్ తీసుకుందని రాశీ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ గా మారింది. ఈమె వెండితెర మీద కనిపించిన చివరి సినిమా లంక. ఇది 2017 వ సంవత్సరం లో విడుదలైంది, ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ ఇచ్చిన రాశీ ఇప్పుడు స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ లో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here