రామ్ చరణ్ అయితే అన్నిటికీ ఓకే.. జాన్వీని వాడేసుకుంటున్న టాలీవుడ్

- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‏తో జోడీ కట్టి ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సౌత్‎లో ఈ చిత్రంతో తొలిసారిగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ బ్యూటీ. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జాన్వీ సరికొత్తగా కనిపించబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పిక్స్‎లో జాన్వీ లుక్స్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీ సెట్స్ మీద ఉంది. ఈ భామ ముంబై నుంచి వచ్చి షూటింగ్‎లో పాల్గొంటోంది. హైదరాబాద్‎లో సందడి చేస్తోంది.

జాన్వీ కపూర్
జాన్వీ కపూర్

అయితే జాన్వీని పూర్తిగా వాడేయాలని టాలీవుడ్ దర్శక నిర్మాతలు అనుకుంటున్నట్లు ఉన్నారు. అందుకే ఆమెపై వరుస ఆఫర్లు కురిపిస్తున్నారు. ఉప్పెనతో తుఫాను సృష్టించిన డైరెక్టర్ బుచ్చిబాబు తన నెక్స్ట్ ప్రాజెక్టులో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్‎గా ఎంపిక చేసిన్టలు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. జాన్వీ కూడా రామ్ చరణ్‎కు జోడీగా నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. అంతే కాదు ఇదే మూవీలో మరో హీరోయిన్‎గా మృణాల్‎ను సెలక్ట్ చేశాడట బుచ్చిబాబు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నాడు.

Ram Charan Janhvi Kapoor

ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ తోనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అలాగే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కూడా సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.. మొన్నామధ్య బుచ్చిబాబు సినిమా గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా.. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తోనూ మరో లవ్ స్టోరీ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. శంకర్ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here