మరోసారి స్టేజ్ పై పాటపాడిన బాలకృష్ణ.. మొదలైన ట్రోల్స్

- Advertisement -

బాలకృష్ణ కు (Balakrishna) పాటలు పాడే టాలెంట్ ఉందని తెలిసిన విషయమే. తన సినిమాల్లోనూ ఆయన పాటలు పాడారు. పలు వేదికల మీద కూడా ఆయన సింగింగ్ పెర్ఫార్మెన్సులు ఇచ్చారు. ఇటీవల ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లోనూ ఆయన పాటలు పాడారు. కాకపోతే బాలయ్యకు తన తండ్రి నందమూరి తారక రామారావు పౌరాణిక సినిమాల్లో పాటలు పాడటమంటే ఎక్కువ ఇష్టం. మోడరన్ సాంగ్స్ కన్నా ఆ పాత పాటలనైతే బాలయ్య బాగా పాడతారు. ఈ విషయాన్ని మరోసారి ఆయన నిరూపించారు.

బాలకృష్ణ
బాలకృష్ణ

దోహాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లైవ్‌లో పాట పాడి అలరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖతార్‌లోని దోహాలో శుక్రవారం ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభిమానులు కోరగా.. ఎన్టీఆర్‌ నటించిన ‘జగదేకవీరుని కథ’ నుంచి ‘శివశంకరీ’ పాటను పాడారు. ఆయన పాటకు ప్రేక్షకులు ఫిదా అయి.. చప్పట్లతో తమ అభిమానాన్ని చాటారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు అప్పుడే ట్రోల్స్ మొదలుపెట్టేశారు.

ఇక ఈ ఏడాది ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది బాలకృష్ణకు 108వ సినిమా. కుటుంబ అంశాలతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌కు మంచి స్పందన వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here