Manisha Koirala : పెళ్లైన ఆర్నెళ్లకే భర్త చిత్ర హింసలకు గురిచేశాడంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న స్టార్ హీరోయిన్

- Advertisement -

Manisha Koirala : మనీషా కోయిరాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్రిమినల్‌, బొంబాయి, ఒకే ఒక్కడు, భారతీయుడు తెలుగు ప్రేక్షకులను అలరించింది. నెల్లూరి నెరజాణగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా చోటు సంపాదించుకున్నారు. చాలాకాలం తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతోంది. నేపాల్‌కు చెందిన మనీషా కొయిరాలా.. టాలీవుడ్, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించారు. అంతే కాకుండా దిల్‌ సే, భాఘి, కంపెనీ, లస్ట్‌స్టోరీస్‌ లాంటి హిందీ చిత్రాల్లో కనిపించారు.

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ మనీషా కొయిరాలా గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ బ్యూటీ చాలా మంది సెలబ్రిటీలతో ఎఫైర్ నడిపించినట్లు గుసగుసలు వినిపించాయి. నేపాల్‌కి చెందిన వ్యాపారవేత్తతో సామ్రాట్‌ దహల్‌తో 2010లో మనీషాకు వివాహం జరిగింది. పెళ్లైన ఆరు నెలలకే వీరిమద్య భేదాభిప్రాయాలు వచ్చి 2012లో విడాకులు తీసుకుంది. ఆ సమయంలోనే మనీషా క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. ఇటీవలే తన పెళ్లి గురించి మాట్లాడింది.

- Advertisement -

ఈ అమ్మడు తన భర్త పై షాకింగ్ కామెంట్స్ చేసింది. నా భర్తే నాకు శత్రువు, అతనికి నాపై ఎప్పుడూ ప్రేమ లేదు, నాకు కూడా ఆయన అంటే ఇష్టం లేదు. పెళ్లైన ఆరు నెలలకే నా భర్త నాకు శత్రువు అయ్యాడు, ఒక స్త్రీకి ఇంతకంటే దారుణం ఏముంటుందంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మనీషా చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మనీషా కొయిరాలా కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో టచ్ లోనే ఉంటుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here