Hebah Patel : మీ మూడు బాగుందా అన్న యాంకర్.. కోపంతో నేను చేయనని లేచి వెళ్లిపోయిన హెబ్బాపటేల్

- Advertisement -

Hebah Patel : తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనకు గాను ప్రేక్షకులు ఆమెకు ఫిదా అయిపోయారు. సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో ఓవర్ నైట్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాలు చేసినా తన కెరీర్ కు ఉపయోగపడలేదు. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకుని మళ్లీ నిఖిల్ సరసన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా చేసి హిట్ కొట్టింది. ప్రస్తుం మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తోంది. ఆ మధ్య ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సినిమాతో ఓటీటీలోకి అడుగు పెట్టింది. ‘ఆహా’లో రిలీజ్ అయి ఈ చిత్రంలో నటించిన హెబ్బా పటేల్ నటన చూసిన విమర్శలు సైతం ప్రశంసించారు. దీంతో ప్రస్తుతం ఓటీటీలో బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ లు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే ‘గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆహా ఓటీటీలో రేపటినుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

Hebah Patel
Hebah Patel

ఈ క్రమంలోనే సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హెబ్బా పటేల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇంటర్వ్యూలో స్టార్టింగ్ లోనే యాంకర్ మీ మూడు బావుందా? అంతా ఓకేనా? అని అడగడంతో తనకు అర్థం కాలేదని తెలిపింది. దీంతో మరోసారి మీ మూడ్ బాగుందా? అంతా ఓకేనా? ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? అని అడిగాడు. తన ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటో అర్థం కాని హెబ్బా పటేల్ హర్ట్ అయి మధ్యలోనే వెళ్లిపోయింది. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో చూసి నెటిజన్స్ ఇది ఫ్రాంక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ ఘటన నిజంగానే జరిగినట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here