Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పూనకాలే.. ఆ ఘనత సాధించిన తొలి హీరోగా రికార్డు..

- Advertisement -

Allu Arjun : టాలీవుడ్ ఐకాన్ స్టార్, బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డు గెలిచిన తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ మరోసారి చరిత్ర సృష్టించాడు. ఈసారి దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అతని మైనపు బొమ్మ కొలువు దీరింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా బన్నీ నిలిచాడు. అల్లు అర్జున్ మైనపు బొమ్మను ఈ ఏడాది చివర్లో ఆవిష్కరిస్తారు. తాజాగా మ్యూజియం నిర్వాహకులు మైనపు బొమ్మ కోసం అతని కొలతలు తీసుకున్నారు.

Allu Arjun

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాది మొదట్లోనూ దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులను అల్లు అర్జున్ కలిశాడు. అతని స్టాచూ కోసం ఏకంగా 200 కొలతలు తీసుకోవడం విశేషం. అచ్చూ మనిషిని పోలినట్లుగా మైనపు బొమ్మలను తయారు చేయడంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు పేరుగాంచారు. దీంతో పర్ఫెక్ట్ స్టాచూ కోసం వాళ్లు చాలా జాగ్రత్తగా, అణువణువూ కొలతలు తీసుకుంటారు.

తనకు ఈ అరుదైన ఘనత దక్కుతుండటంపై అల్లు అర్జున్ స్పందించాడు. ఇది చాలా గర్వకారణమని అన్నాడు. తాను చిన్నతనంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి వెళ్లానని, అయితే ఏదో ఒక రోజు తన మైనపు బొమ్మ అక్కడ కొలువుదీరుతుందని ఊహించలేదని బన్నీ చెప్పాడు. పుష్ప ది రైజ్ మూవీలో నటనకుగాను ఈ మధ్యే అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డు గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ చేస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here