పుష్ప 2 లో రష్మిక మందన్న చనిపోతుందా.. ఇదంతా వారి పనే

- Advertisement -

నటి రష్మిక మందన్న (Rashmika mandanna)ను ఓ వర్గం నెటిజన్లు ఎప్పుడూ ట్రోల్ చేస్తూ ఉంటారు. దీనిపై ఆమె కూడా ఘాటుగా స్పందిస్తుంది. కానీ ప్రతిదానికీ ఒక పరిమితి ఉంటుంది. ఇటీవల ఓ ఫొటోను కొంతమంది వైరల్ చేశారు. పుష్ప 2లో శ్రీవల్లి(Sri Valli) పాత్ర చనిపోతుందని చెబుతున్నారు. అయితే ఇందులో నిజమేంత అని తెలుసుకోకుండా చాలా మంది కూడా నమ్మేస్తున్నారు. కొందరు మరో నటి ఫోటోను పోస్ట్ చేసి అది పుష్ప 2(Pushpa 2)లో శ్రీవల్లి పాత్ర అని తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. నటి శవంలా పడి ఉన్న ఫోటో ఇది. ‘పుష్ప 2’ చిత్రంలో కథానాయిక పాత్ర చనిపోతుందని ప్రచారం జరుగుతోంది.

రష్మిక మందన్న
రష్మిక మందన్న

దీనికి సంబంధించిన రష్మిక ఉన్నట్లు ఓ ఫోటో కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో రష్మికను చంపేస్తున్నారా? అందుకే సెకండ్‌ హీరోయిన్‌ను తీసుకుంటున్నారా అంటూ ఎవరికి వాళ్లే కథలు అల్లేసుకున్నారు. రష్మిక అంటే పడని వాళ్ళు ఇలా క్రెయేట్ చేశారు.అయితే నిజానికి ఆ ఫోటో పుష్ప-2లోది కాదు. ఓ మరాఠీ సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్‌ అది. అంతేకాదు, అక్కడ కనిపించిన హీరోయిన్‌ కూడా రష్మిక కాదు. ఆమె పేరు ఈషా దివేకర్‌. సో పుష్ప-2లో రష్మిక చనిపోతుంది అంటూ వైరల్‌ అవుతున్న న్యూస్‌లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.

pushpa 2
pushpa 2

అల్లు అర్జున్‌(Allu Arjun)తో పాటు పుష్ప 2 చిత్రంలో ఫహద్ ఫాసిల్, కన్నడ డాలీ ధనంజయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప’ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా గ్రాండ్‌గా రెడీ అవుతోంది. మెుదటి పార్ట్ గా దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్స్ ఉన్నారు. అన్ని భాషల్లోనూ సినిమా హిట్ అయింది. దీంతో పుష్ప 2పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో రష్మిక మందన్నకు మంచి పాపులారిటీ వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here