Raja Saab సినిమాను మిస్ చేసుకున్న పాన్ ఇండియా హీరో ఎవరో తెలుసా ?

- Advertisement -


Raja Saab : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరో అయిపోయారు. ఆ తర్వాత తీసిన ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతున్నాయి. సలార్ సినిమా తర్వాత ప్రభాస్ పూర్తి యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. ఇక తాజాగా ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎప్పటిలా యాక్షన్ మూడ్‌లో కాకుండా.. కాస్త డిఫరెంట్‌గా కామిక్ రోల్లో కనిపించబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందట.. ఇందులో ప్రభాస్ ఎప్పుడు కనిపించని విధంగా చాలా డిఫరెంట్ గా ఉంటాడట.

Raja Saab
Raja Saab

ఇక ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‎గా రాబోతుందట. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అనేది వేచి చూడాలి. ఈ సినిమా విషయంలో మారుతీ కానీ.. ప్రభాస్ కానీ.. చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ సక్సెస్ కొడితేనే మారుతికి మంచి గుర్తింపు వస్తుంది. లేకపోతే ఆయన కెరీర్ డేంజర్లో పడే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు గోపీచంద్ తో తెర‌కెక్కించిన మూవీ పక్కా కమర్షియల్ గా ఫ్లాప్ అయింది.

allu arjun
allu arjun

ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటి అల్లు అర్జున్‌తో చేయాలని దర్శకుడు మారుతి భావించాడట. వాళ్ల కాంబోలో అంతకుముందు ఒక సినిమా రావాల్సి ఉంది. కానీ అది ఏవో కారణాలతో ఆగిపోయింది. ఇక త‌ర్వాత ఆ సినిమా చేయాలి అనుకున్నాడు. కానీ అప్పుడు కూడా అల్లు అర్జున్ దర్శకుడు కొరటాల శివతో సినిమా చేస్తానని కమిట్ అవ్వడంతో ఈ సినిమా చేయలేకపోయాడు. దీంతో ఈ కథ ప్రభాస్ దగ్గరకు వెళ్లింది. ఈ సినిమాతో మారుతి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here