రామ్ డబుల్ ఇస్మార్ట్ ఆలస్యానికి అసలు కారణం ఏమిటి..?

- Advertisement -

నటుడు రామ్ పోతినేని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ రామ్ పోతునేని కాంబినేషన్లో డబల్ ఇస్మార్ట్ రాబోతోంది. ఈ సినిమా మొదలైనప్పటినుండి కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఈ సినిమా పరిస్థితి ఏంటి అన్నది అభిమానులకి అసలు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఈ సినిమా నుండి అప్డేట్ ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. అలానే, ఎప్పుడు ఫస్ట్ సాంగ్ ని ఇస్తారా అని కూడా చూస్తున్నారు. అసలు ఎందుకు ఆలస్యం అవుతుందో కూడా ఎవరికీ అర్థం అవ్వట్లేదు. పైగా ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పట్లేదు. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం చూసినట్లయితే ఈ మూవీ 95% షూటింగ్ పూర్తి చేసుకుంది.

ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ ఇంటర్వెల్ ఫైట్ పూర్తి అయిపోయాయి రెండు పాటలను కూడా
షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వర్క్ అంతా కూడా ఒక పది శాతం వరకు మాత్రమే మిగిలి ఉంది రెండూ లేదా మూడు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది కానీ సమస్య థియేటర్ అమ్మకాలు జరగాలి. ముఖ్యంగా డిజిటల్ సేల్స్ హిందీ సేల్స్ కంటిన్యూగా మూవీస్ చేస్తూ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉంటే బ్యానర్లు కాస్త పని జరిపించుకోగలుగుతున్నాయి.

- Advertisement -

కానీ పూరీ బ్యానర్ లో ఉన్నది ఒక్క సినిమానే. ఇప్పటికే సినిమా మీద 50 నుండి 60 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నాన్ ధియేటర్ అమ్మకాలు జరిగిపోయినట్లయితే మూవీ ఫినిష్ చేసి విడుదల కి రెడీ చేయబోతున్నారు నాన్ థియేటర్ సేల్స్ కాకుండా తొందరగా పడటం మంచిది కాదు అందుకని పూరి వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చార్మి కొన్ని పనులు చేస్తోంది. అలానే పూరి కూడా హైదరాబాదులో ఉండి వెళ్లారు. నాన్ థియేటర్ బిజినెస్ మీద సీరియస్ గా అయితే పని చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here