‘విరూపాక్ష’ 2 వారాల వసూళ్లు.. మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ కలెక్షన్స్ ని కూడా దాటేసిందిగా!

- Advertisement -

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం ఈ సమ్మర్ లో సృష్టించిన బాక్స్ ఆఫీస్ ప్రభంజనం అంతా ఇంతా కాదు.విడుదలకు ముందు నుండే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, ఆ అంచనాలను దాటి అభిమానులను అలరించడం విశేషం.మొదటి రోజు ఓపెనింగ్స్ దగ్గర నుండి, ఇప్పటి వరకు ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్తగా విడుదలైన చిత్రాలను కూడా డామినేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.

విరూపాక్ష
విరూపాక్ష

విడుదలై రెండు వారాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆడియన్స్ ఈ చిత్రం కోసం పనిగట్టుకొని థియేటర్స్ కి వెళ్ళడానికి కారణం, ఇది కేవలం థియేటర్స్ లో చూసే సినిమా కాబట్టి.ఎందుకంటే థియేటర్స్ లో ఈ చిత్రాన్ని చూస్తే వచ్చే అనుభూతి, ఓటీటీ లో చూస్తే రాదు, ఈరోజు ఈ చిత్రం హిందీ, తమిళం , మళయాలం బాషలలో ఘనంగా విడుదలైంది.అయితే రెండు వారాల్లో ఈ సినిమా తెలుగు వెర్షన్ ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు చూద్దాము.

ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమా రెండు వారాలకు కలిపి దాదాపుగా 42 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రం దాదాపుగా 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.విశేషం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇక్కడ కేవలం 13 కోట్ల రూపాయిలు మాత్రమే వసూలు చేసింది.అలా సాయి ధరమ్ తేజ్ ఏకంగా మామయ్య కలెక్షన్స్ ని దాటేశాడు.

- Advertisement -

అలాగే సీడెడ్ లో 5 కోట్ల రూపాయలకు పైగా ఇప్పటి వరకు ఈ సినిమా రాబట్టినట్టు సమాచారం. రోజువారీ కలెక్షన్స్ లో నైజాం తర్వాత ఎక్కువ షేర్ వసూళ్లను రాబడుతున్న ప్రాంతం సీడెడ్ మాత్రమే.ఆ తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం లో 4.67 కోట్లు, ఈస్ట్ గోదావరి లో 2.37 కోట్లు, వెస్ట్ గోదావరి లో 1.67 కోట్లు, గుంటూరు మరి కృష్ణ జిల్లాలకు కలిపి నాలుగు కోట్ల 50 లక్షల రూపాయిలు, నెల్లూరు లో కోటి 8 లక్షల రూపాయిల షేర్స్ ని రాబట్టింది. అలా రెండు వారాలకు కలిపి ఓవర్సీస్ తో సహా 42 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here