మరో ఇద్దరు స్టార్ హీరోలు చనిపోతారు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..

- Advertisement -

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు..ఈ మధ్య ఆయన ఏం చెప్పినా కూడా జరుగుతున్నాయి.. దాంతో అందరు ఆయనను నమ్ముతున్నారు.. మొన్నీమధ్య యంగ్ హీరో చనిపోతారని అన్నాడు అదే విధంగా తారక రత్న చనిపోయాడు.. ఇప్పుడు మరో ఇద్దరు చనిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.. ఆయన ఇంకా ఏం చెప్పాడో ఓ లుక్ వేద్దాం పదండీ..

వేణు స్వామి
వేణు స్వామి

వేణు స్వామికి మంచి క్రెడిబిలిటీ ఉంది. అతడు చెప్పేవి జరుగుతాయని, ఆయనతో పూజలు చేయించుకుంటే కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని నమ్మేవారు ఉన్నారు. హీరోయిన్ రష్మిక మందాన ఈయన ప్రియ శిష్యురాలు. తరచుగా వేణు స్వామి ఆమె కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు.. నిశ్చతార్థం ను క్యాన్సల్ చేసుకోమని చెప్పాడట.. నిశ్చితార్థం అయ్యాక రష్మిక అతడికి బ్రేకప్ చెప్పింది. వేణు స్వామి మాట అంటే ఆమెకు అంత నమ్మకం. ఇటీవల మరొక హీరోయిన్ నిధి అగర్వాల్ వేణు స్వామితో ప్రత్యేక పూజలు జరిపించుకుంది. చివరికి బాలకృష్ణ కూడా నా కస్టమర్ అని వేణు స్వామి ఒక సందర్భంలో చెప్పారు.

అలాగే కొందరు హీరోలు, హీరోయిన్స్ విషయంలో ఆయన చెప్పిన విషయాలు నిజమయ్యాయి. ఈ క్రమంలో ఆయన చేసిన లేటెస్ట్ కామెంట్స్ భయపెడుతున్నాయి.. మరో ఇద్దరు హీరోలు 2026 లో చనిపోతారని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఒకరు అనారోగ్యంతో మరొకరు ఆర్థిక ఇబ్బందుతో ఆత్మహత్య చేసుకుంటారని చెప్పాడు.

- Advertisement -

అలాగే మరొక స్టార్ హీరోయిన్ అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులపాలవుతుందని వేణు స్వామి చెప్పారు. వేణు స్వామి చెప్పిన ఆ ఇద్దరు హీరోలు ఎవరనే చర్చ మొదలైంది. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని వేణు స్వామి ముందే ఊహించి చెప్పారు.. అలాగే ప్రభాస్ సినిమాకు కూడా ఆయన చెప్పిందే జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఆ ఇద్దరు ఎవ్వరో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here