ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవి లత.. ఫ్యాన్స్ ఫైర్..

- Advertisement -

హీరోయిన్ మాధవి లత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు ఒకటో రెండో సినిమాల్లో మెరిసింది.. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాను టార్గెట్ చేసుకొని తన ఇష్టమోచ్చినట్లు తిడుతూ ట్రోల్స్ కు గురవుతుంది.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి..

మాధవి లత
మాధవి లత

ఇటీవల విడుదలైన ప్రభాస్ సినిమా ‘ఆదిపురుష్‌’ సినిమా ప్రేక్షకులను మెప్పించటంలోనూ.. జనాల్ని ఒప్పించటంలోనూ విఫలమైంది. రామాయణాన్ని ఇష్టం వచ్చినట్లు చిత్రీకరించారంటూ దర్శకుడు ఓం రౌత్‌పై సోషల్‌ మీడియా వ్యాప్తంగా ట్రోల్స్ ను అందుకుంటుంది.. చాలా విషయాల్లో రామాయణానికి.. ఆదిపురుష్‌ సినిమాకు సంబంధం లేకుండా ఉందని, దేవుడి సినిమాను కమర్షియల్‌ సినిమాగా మార్చేశారని జనం మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్‌ వివాదంపై హీరోయిన్‌ మాధవీలత స్పందించారు..

madhavilatha

ఆమె మాట్లాడుతూ..రాముడి పాత్ర చేసిన ప్రభాస్‌ను టార్గెట్‌ చేస్తూ కామెంట్లు చేశారు. సినిమా విషయంలో ప్రభాస్‌ది కూడా తప్పు ఉందని అన్నారు. ఆదిపురుష్‌ మ్యాటర్‌లో అందరూ డైరెక్టర్‌ని దొబ్బుతున్నారని, హీరో మ్యాటర్‌లో సైలెంట్‌ అయ్యారని అన్నారు. హీరోకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. స్టోరీ వినేటప్పుడు, తీసేటప్పుడు, డైలాగ్‌ చెప్పేటప్పుడు తెలియలేదా అని అన్నారు.. ప్రభాస్ ఏమైనా కొత్తగా సినిమాలు చేస్తున్నారా..

- Advertisement -

డైరెక్టర్ ఏదీ చెబితే అది చెయ్యడానికి కథ విన్నాడుగా అప్పుడే తెలియాలి కదా అంటూ తీవ్ర విమర్శలు చేసింది.. ఈ విషయంలో ఫ్యాన్స్ నన్ను ఏమన్నా పర్వాలేదు అంటూ వ్యాఖ్యానించారు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాధవీ లతపై ఆ‍గ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో జోలికి వస్తే ఊరుకునేది లేదని అంటున్నారు.. మరి ఇది ఎన్ని చర్చలకు దారి తీస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here