Veera Simha Reddy : ఆ ఒక్క డైలాగే సినిమా పై ఎఫెక్ట్ చూపిస్తుందా?..బాలయ్య ఫ్యాన్స్ ఆందోళన..

- Advertisement -

Veera Simha Reddy : సంక్రాంతి పండుగ రావడానికి ఇంకా రెండు రోజుల టైం వుంది..ముఖ్యంగా బాలాయ్య ఫ్యాన్స్ కు పునకాలు ..సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలు పోటీకి దిగాయి.బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ద్వారా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాగా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోని ఈ రెండు సినిమాలపై ఇప్పటికే అభిమానులలో భారీ అంచనాలు పెరిగిపోయాయి.

Veera Simha Reddy
Veera Simha Reddy

ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఈ క్రమంలోనే సినిమా టికెట్ల రేట్లు పెంచాలంటూ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఇప్పటికే ఈ విషయం గురించి చర్చించిన విషయం మనకు తెలిసిందే..తాజాగా ఈ విషయం గురించి ఒక వార్త వైరల్ గా మారింది.ఏపీ ప్రభుత్వం ఈ రెండు సినిమాలకు 45 రూపాయలు చొప్పున టికెట్లు పెంచవచ్చని అనుమతి తెలిపినట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రచారం జరుగుతుంది.

వైసీపి పై కౌంటర్ వెయ్యడం వల్ల రూ .5 తగ్గిందని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ఒక్క డైలాగ్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రతి టికెట్ పై ఐదు రూపాయలు చొప్పున ఫైన్ వేసింది అంటూ కొందరు ఈ విషయం పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..మొత్తానికి ఈరోజు బాలాయ్య సినిమా థియెటర్ల లోకి వచ్చింది..టీడీపీ నేతలకు కన్నుల పండుగ అయ్యింది..మొదటి షోకు మంచి టాక్ ను అందుకుంది..మరి పబ్లిక్ ఎమంటున్నారో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here