లావణ్య త్రిపాఠి కోసం కష్టపడి పిజ్జా తయారు చేసిన వరుణ్ తేజ్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..

- Advertisement -

ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్.. వీరిద్దరూ కూడా రిలేషన్ లో ఉన్నారంటు వార్త చక్కర్లు కొడుతుంది.. అంతేకాదు త్వరలోనే వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వినిపిస్తుంది.. తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఈ నెల 9న వీరి ఎంగేజ్ మెంట్ ఉంటుందని టాక్ టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఈక్రమంలోనే వీరిద్దరు ప్రస్తుతం వెకేషన్‌లో భాగంగా పారిస్‌లో చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తోంది. .ఇప్పటికే కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నాయి..

వరుణ్ తేజ్
వరుణ్ తేజ్

ఇది ఇలా ఉండగా..వరుణ్ తేజ్ తన వంట ప్రావీణ్యాన్ని బయట పెట్టాడు. చెఫ్ లు వాడే ఆఫ్రాన్ ,,క్యాప్ పెటుట్టుకుని రకరకాల వంటలు చేశాడు. పీజా, పాస్తాతో పాటు.. ట్రెడిషినల్ ఫుడ్ అయిన గవ్వలు కూడా చేశాడు వరుణ్. ఇక వాటిని నెటిజన్లకు చూపిస్తూ.. తనలో ఈ టాలెంట్ కూడా ఉందని చెప్పకనే చెప్పాడు వరుణ్.. అంతేకాదు మనల్ని మించి వంటలు ఎవ్వరు చెయ్యలేరు అంటూ తనకు తానే కామెంట్ చేసుకున్నాడు.. ఇందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి..

ఇకపోతే.. వరుణ్‌తేజ్‌ సినిమాల విషయానికి వస్తే.. ఆయన గాండివధారి అర్జున సినిమా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ జోనర్‌లో వస్తున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ఈ మూవీలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా.. విమలారామన్‌, నాజర్‌, వినయ్‌ రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.. మరి ఈ సినిమా అన్నా ఇతనికి మంచి హిట్ ను ఇస్తుందేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here