వాళ్ల వల్లే నా క్యాన్సర్ విషయం అలా అయింది.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి క్యాన‌ర్ బారిన ప‌డ్డార‌ని, ఏఐజీ హాస్పిట‌ల్‌లో కొల‌నో స్కోపీ చేయించుకోగా క్యాన్స‌ర్ క‌ణాలు ఉన్న‌ట్టుగా డాక్ట‌ర్లు గుర్తించార‌ని, అయితే ప్రారంభ ద‌శ‌లో క్యాన్స‌ర్‌ని గుర్తించ‌డం వ‌ల్ల క్షేమంగా గా తాను బ‌య‌ట‌ప‌డ్డాన‌ని చిరంజీవి తెలిపిన‌ట్టుగా శ‌నివారం సాయంత్రం ఉన్న‌ట్టుండి ప్ర‌చారం మొద‌లైంది. చిరు క్యాన్స‌ర్‌కు గుర‌య్యార‌నే వార్త‌లు క్ష‌ణాల్లో వైర‌ల్ కావ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు ఆయ‌న అభిమానులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఏంటీ మేం విన్న‌ది నిజ‌మేనా? క‌లా అని షాక్ కు గురై తీవ్ర భ‌యాందోళ‌న‌కు లోన‌య్యారు.

చిరంజీవి
చిరంజీవి

దీనిపై ఆయన పూర్తి వివరణ ఇచ్చారు.. తన ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. ‘‘కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.

అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు’’ అని చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here