‘ఆదిపురుష్’ చిత్రం లో లక్ష్మణుడి పాత్రని వదులుకున్న స్టార్ హీరో అతనేనా!

- Advertisement -

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈనెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది, ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని ఒక రేంజ్ లో చేస్తుంది మూవీ టీం. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఆదిపురుష్
ఆదిపురుష్

విడుదలైన రెండు ట్రైలర్లు మరియు పాటలు చిత్రంపై అంచనాలను ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెంచేలా చేసింది. ఇక కాసేపటి క్రితమే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సభ్యులు క్లీన్ U సర్టిఫికేట్ ని జారీ చేసారు. ఈమధ్య కాలం లో ఒక సినిమాకి క్లీన్ U సర్టిఫికేట్ సెన్సార్ సభ్యుల నుండి రాలేదు. అలాంటి ఘనత ‘ఆదిపురుష్‘ చిత్రానికే దక్కింది, చిత్రం నిడివి రెండు గంటల 59 నిముషాలు ఉంటుందట.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ అనే బాలీవుడ్ నటుడు నటించాడు. ఈయన రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని ప్రభాస్ నా పెద్ద అన్నయ్య అంటూ ఎంతో ఎమోషనల్ గా చెప్పుకున్నాడు. అయితే ఈ పాత్ర కోసం సన్నీ సింగ్ ని సంప్రదించే ముందు చాలా మంది హీరోలను సంప్రదించారట. అందులో ‘జాతి రత్నాలు’ హీరో నవీన్ పోలిశెట్టి కూడా ఉన్నాడు.

- Advertisement -

నవీన్ పోలిశెట్టి ని మూవీ టీం సంప్రదించగా ఆయన నటించడానికి సుముఖంగానే ఉన్నప్పటికీ డైరెక్టర్ ఓం రౌత్ కి మాత్రం సన్నీ సింగ్ మాత్రమే ఈ పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోతాడని ఆయన విజన్ కి బలంగా అనిపించిందట. ఇదే విషయాన్నీ ప్రభాస్ కి చెప్పగా ఆయన కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమా నవీన్ పోలిశెట్టి ఒప్పుకొని చేసి ఉంటే ఆయన కెరీర్ కి చాలా ఉపయోగపడేది. పాపం బ్యాడ్ లక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here