Anchor Suma : మీడియా తో యాంకర్ సుమ గొడవ..స్నాక్స్ ని భోజనం లాగ తిని వెళ్లారు అంటూ కామెంట్స్

- Advertisement -

Anchor Suma : యాంకరింగ్ రంగం లో గడిచిన రెండు దశాబ్దాల నుండి సుమ ని మించిన టాప్ యాంకర్ ఎవరూ రాలేదు అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎంతోమంది యాంకర్స్ వచ్చి స్టార్స్ గా మారారు కానీ, సుమ రేంజ్ కామెడీ టైమింగ్ ఉన్నవారు మాత్రం ఇప్పటి వరకు రాలేదని చెప్పొచ్చు. ఈమె వేసే జోకులను స్టార్ హీరోలు కూడా చాలా తేలికగా తీసుకొని నవ్వుతారు. కానీ కొంతమంది మాత్రం తీసుకోలేరు.

Anchor Suma
Anchor Suma

సరిగ్గా ఈరోజు అదే జరిగింది. అసలు విషయం లోకి వెళ్తే పంజా వైష్ణవ్ తేజ్ మరియు శ్రీలీలే హీరో హీరోయిన్లు గా నటించిన ‘ఆదికేశవ్’ సినిమా అతి త్వరలో విడుదల కాబోతున్న సందర్భంగా మూవీ టీం ప్రమోషనల్ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రొమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ మీడియా సమావేశం లో యాంకర్ సుమ మరియు జర్నలిస్ట్స్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.

suma
suma

ముందుగా సుమ మీడియా ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘మేమిచ్చిన స్నాక్స్ ని భోజనం లాగ తిన్న మీడియా మిత్రులు తమ కెమెరాలతో ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము’ అని అంటుంది. ఆ తర్వాత మీడియా సమావేశం ప్రారంభం అయ్యేముందు ఒక విలేఖరి సుమ తో మాట్లాడుతూ ‘మీ యాంకరింగ్ అంటే ఇక్కడ ఉన్న వాళ్లందరికీ చాలా ఇష్టం అండీ. మీరు జోక్స్ చాలా చక్కగా వేస్తారు, కానీ ఇందాక మీరు మీడియా వాళ్ళు స్నాక్స్ ని భోజనం లాగ తింటారు అని అనడం మాకు నచ్చలేదు, మీ జోక్స్ బాగానే ఉంటాయి కానీ మీడియా మీద మాత్రం జోక్స్ వద్దు’ అని అంటాడు.

- Advertisement -

అప్పుడు సుమ సమాధానం ఇస్తూ ‘క్షమించండి సార్, మీరంతా నాకు ఎన్నో ఏళ్ళ నుండి పరిచయం కాబట్టి, ఆ చనువు తో మీ మీద సరదాగా జోక్ వేసాను, మీరు నిజంగా స్నాక్స్ ని స్నాక్స్ లాగానే తిన్నారు’ అంటూ మరోసారి వ్యగ్యంగా సమాధానం ఇస్తుంది. అప్పుడు ఆ విలేఖరి మరోసారి మైక్ అందుకొని ‘ఇవే తగ్గించుకుంటే మంచిది’ అని కౌంటర్ ఇస్తాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here