Bigg Boss Telugu : అమర్ దీప్ ని హౌస్ మేట్స్ టార్గెట్ చెయ్యడం పై హీరోయిన్ రాశీ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Bigg Boss Telugu సీజన్ 2 తర్వాత మన ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నది ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 7 . ‘ఉల్టా పల్టా’ కాన్సెప్ట్ తో మొదలైన ఈ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో లేటెస్ట్ సీజన్ రోజుకో ట్విస్ట్, వారానికి ఒక షాకింగ్ ఎలిమినేషన్ తో ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. ఇకపోతే హౌస్ లో ప్రస్తుతం టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగుతున్న అమర్ దీప్ పై వ్యక్తిగతంగా మరియు మానసికంగా అవహేళనలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

దీంతో ఆయనపై సోషల్ మీడియా లో సానుభూతి బాగా పెరిగిపోయింది. ఒక వ్యక్తిని ఇంతమంది టార్గెట్ చెయ్యడం కరెక్ట్ కాదు అంటూ పోస్టులు పెడుతున్నారు. మొదటి 5 వారాలు పెద్దగా ఆడని అమర్ దీప్, గత రెండు వారాల నుండి తన ఆటని మెరుగు పర్చుకున్నాడు. హౌస్ లో ప్రతీ ఒక్కరు అమర్ దీప్ ని వెనక చేరి వెక్కిరించడం, దానికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం జరుగుతున్నాయి.

Bigg Boss Telugu 7

ఇది ఇలా ఉండగా ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాశీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అమర్ దీప్ కి సపోర్టుగా పోస్టులు. ఆమె మాట్లాడుతూ ‘రోజురోజుకి నా బిడ్డపై కక్ష్యలు పెరిగిపోతున్నాయి. దయచేసి అందరూ మా అబ్బాయికి ఓటు వెయ్యండి’ అంటూ పోస్టు పెట్టింది. అమర్ దీప్ మరియు ప్రియాంక హీరో హీరోయిన్లు గా స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయినా ‘జానకి కలగనలేదు’ సీరియల్ లో హీరోయిన్ రాశీ అమర్ దీప్ కి అమ్మ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

- Advertisement -
Raashi

అదే విధంగా సినిమాల్లో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ తో కలిసి ‘శ్రీరామ చంద్రులు’ మరియు ‘సందడే సందడి’ వంటి చిత్రాలను చేసింది. ఇలా ఇద్దరితో కలిసి నటించినప్పటికీ కూడా ఆమె అమర్ దీప్ కి సపోర్టు చెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here