Thalapathy Vijay : 14 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్​తో విజయ్.. హిట్​ హిస్టరీ రిపీట్ అవుతుందా..?

- Advertisement -

Thalapathy Vijay 14 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్​తో విజయ్.. హిట్​ హిస్టరీ రిపీట్ అవుతుందా..?.. కోలీవుడ్​తో పాటు టాలీవుడ్​నూ దున్నేస్తున్నాడు. ఈ హీరో స్టార్​డమ్ తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రాలకు పాకేసింది. తుపాకీ మూవీ నుంచి ఈ స్టార్ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు. అంతే ఇక అప్పటి నుంచి విజయ్ ఏ సినిమా రిలీజ్​ అయినా తెలుగులో తప్పకుండా డబ్ చేస్తున్నారు నిర్మాతలు. విజయ్ క్రేజ్​ ఏ రేంజ్​లో ఉందంటే.. డబ్బింగ్ సినిమాకు కూడా సూపర్ కలెక్షన్లు వచ్చే అంత. తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ఫిదా అయిన విజయ్ నేరుగా తెలుగులో సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు.

టాలీవుడ్​లో ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ దళపతి. టాలీవుడ్ నిర్మాణ సంస్థలో తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో వారసుడు అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన నేషలన్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది.

trisha vijay thalapathy
trisha vijay thalapathy

ఈ సినిమా తరువాత విజయ్ తమిళ స్టార్ అండ్ యంగ్ డైరెక్టర్ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ మూవీ చేయబోతున్నాడు. గతంతో విజయ్​కు వరుస విజయాలు అందించాడు లోకేష్. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి ఇంకా క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే దళపతి విజయ్ పక్కన ఈ మూవీలో హీరోయిన్​గా త్రిషను ఫిక్స్ చేశారట. ఇదే కనుక నిజమైతే దాదాపు 14 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరు కలిసి నటించనున్నారు. వీరి కాంబోలో ఇప్పటికే 4 సినిమాలు తెరకెక్కాయి. ఆ నాలుగూ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ మూవీలో త్రిషను కన్ఫామ్ చేస్తే ఇది ఐదో సినిమా అవుతుంది. ఈ మూవీ కూడా బంపర్ హిట్ అవుతుందని విజయ్-త్రిష ఫ్యాన్స్ అంటున్నారు.

Trisha
Trisha

గతంలో వీరి కాంబోలో వచ్చిన ఆ నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర సూపర్‌ హిట్లుగా నిలిచాయి. వీరిద్దరు కలిసి చివరిగా 2008లో వచ్చిన కురివి సినిమాలో నటించారు. పద్నాలుగు సంవత్సరాల తర్వాత విజయ్-త్రిష కలిసి నటించనుండటంతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ఎప్పుడెప్పుడు వీళ్లిద్దరిని తెరపై కలిసి చూద్దామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ అంతా ఫేవరెట్ పెయిర్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తున్నారు.

ఈ మధ్య త్రిష పొన్నియన్‌ సెల్వన్‌తో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు సినిమాలున్నాయి. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం LCUలో భాగంగానే తెరకెక్కనున్నట్లు ఇటీవలే నటుడు నారైన్‌ తెలిపాడు. ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here