Chiranjeevi : నిజంగానే చిరంజీవి మనసులో చెప్పుకోలేని భాద ఉందా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ Chiranjeevi పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన అతి కొద్ది మందిలో మొదటగా చిరంజీవి పేరు వినిపిస్తోంది..ఆయన యాక్టింగ్, డైలాగ్స్, ఫైట్స్ మాత్రమే కాదు ఆయన కామెడీ టైమింగ్ కు కూడా పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల అయిన పాటలు, ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. అయితే సినిమా విడుదలకు ముందు థియేటర్లలో కంటే బుల్లితెరపై సందడి చేయడానికి సిద్దమయ్యారు చిరు.

Chiranjeevi
Chiranjeevi

ఓ ప్రముఖ చానెల్ లో యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న ‘సుమ అడ్డా’ కార్యక్రమంలో పాల్గొన్నారు చిరంజీవి. దీనికి సంబంధించిన ప్రోమోను ఇటీవలే విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. చిరు మాములుగా టీవీ షోలలో కనిపించడం తక్కువ.. అయితే చాలా రోజుల తర్వాత చిరు ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొనడంతో ఈ ప్రోగ్రాంపై ఆసక్తి నెలకొంది. ‘సుమ అడ్డా’ కార్యక్రమంలో చిరంజీవితో పాటు ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ, నటుడు వెన్నెల కిషోర్ లు కూడా పాల్గొన్నారు.

Chiranjeevi in cash

అయితే మెగాస్టార్ చిరంజీవి తోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం విశేషం. ఇక ఈ ప్రోమోలో చిరంజీవి చేసిన సందడి అంతా ఇంతా కాదు. తన కామెడీ టైమింగ్ తో సుమాను ముప్పతిప్పలు పెట్టారు చిరు. ఆయన పంచ్ డైలాగ్స్ తో యాంకర్ సుమ ఉక్కిరిబిక్కిరైపోయింది.. ఎపిసోడ్ మొత్తం ఫన్నీగా సాగింది..మొత్తానికి ఆ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనర్గా సాగింది..చివరిలో చిరంజీవిని తన తండ్రి గురించి అడగ్గా.. కళ్ళ నుంచి నీళ్ళు కారాయి.అతను ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు ఇప్పుడు మళ్ళీ వస్తే వదిలి పెట్టను, ఆయన లేని లోటు నాకు బాగా తెలుస్తుంది..నా మనసులో చెప్పుకోలేని బాధ అని ఎమోషనల్ అయ్యారు.. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here